బహుముఖ ప్రజ్ఞాశాలి జగ్గయ్య.. న్యూస్ రీడర్గా జీవితాన్ని ప్రారంభించిన జగ్గయ్య నటుడుగా మారి వెండితెరపై ఎన్నో విభిన్నపాత్రలలో నటించాడు. జగ్గయ్యకి గుర్తింపు తెచ్చింది మాత్రం ఆయన గొంతు అనే చెప్పాలి. కంచు వాచస్పతి, కంచు కంఠం, రాజకీయవేత్త, సాహిత్యకారుడు, సినీ నటుడు ఇలా ఎన్నో పాత్రలను నిజజీవితంలో పోషించిన జగ్గయ్య పలు వేదికలపై మనం అనే భావన మన అందరిలో ఉన్నప్పుడే ఈ దేశం ముందుకు పోతుంది అని అంటుండేవారు.
నటుడిగా ఉన్న సమయంలో జగ్గయ్య బాగా బిజీగా గడిపేవారు. ఒకసారి జగ్గయ్య బాగా బిజీగా ఉండే రోజులో రాత్రి, పగలు షూటింగ్లో పాల్గొనేవారు. దాదాపు మూడు షిఫ్ట్లలో పనిచేసేవారట. ఆయన ఒప్పుకున్న అన్ని సినిమాల ప్రాజెక్టులు పూర్తి అవ్వడంతో ఒక్కసారి ఆయనకు విరామం దొరికింది . అప్పటివరకు షూటింగ్లలో అలసిపోయిన జగ్గయ్య తెల్లవారుజామున ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్లకి ఇలా చెప్పాడట.
నేను ఇప్పుడే తెల్లవారుజామున వచ్చాను నేను పడుకొని నిద్రపోతాను. నన్ను ఎవరు లేపకండి. తలుపు దగ్గరకు అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండండి. నేను లేవకపోతే భోజనానికి, టిఫిన్ కి అంటూ లేపొద్దు.. నేనే లేచి వచ్చి తింటాను అని నిద్రపోయారట. అలా పడుకున్న జగ్గయ్య రెండు రోజులు రాత్రి, పగలు తేడా లేకుండా మొత్తం 48 గంటలు పూర్తిగా నిద్రించారట. నిద్రలేచిన తర్వాత డాక్టర్ వద్దకు వెళ్లి ఈ విషయాన్ని వివరించగా 48 గంటల నిద్ర నేను ఇప్పటివరకు ఎక్కడ ఇది వినలేదు. ఇది చాలా మంచిది దీనివల్ల ఇబ్బంది లేదు అని చెప్పారట.