బాలయ్య – కమలహాసన్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బాస్టర్ సినిమా ఇదే..!

ఇండ‌స్ట్రీలో ఎన్నో క్రేజీ కాంబినేషన్ల‌లో సినిమాలు తెర‌కెక్కి సూపర్ హిట్లుగా నిలుస్తాయి. కొన్ని కాంబినేషన్స్‌లో సినిమాలు రూపొందించాల‌ని ఎంద‌రో డైరెక్టర్లు ఎన్నోసార్లు ప్లాన్లు వేసుకున్నా.. అవి సెట్ కాకపోవడం.. కొన్ని కొన్ని సార్లు కాంబినేషన్ సెట్ అయ్యి… అన్ని ఓకే అయిన తర్వాత చివరి మూమెంట్లో క్యాన్సిల్ అవుతుంటాయి.

ఇలా బాలయ్య – కమల్ హాసన్ కాంబినేషన్లో రావాల్సిన ఓ సూపర్ హిట్ మూవీ మిస్సయిపోయింది. ఆ సినిమా ఏదో కాదు బాల‌య్య కెరీర్‌లోనే మంచి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌లో ఒక‌టిగా నిలిచిన‌ ఆదిత్య 369. టైం ట్రావెల్ కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో బాలయ్య హీరోగా, మోహిని హీరోయిన్గా నటించారు.

సిల్క్ స్మిత, ఆనంద్ గొల్లపూడి, అమ్రీష్ పురి, మారుతి రావు కీరోల్ ప్లే చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో అప్పట్లో బాలయ్య కెరీర్‌లోనే హైయ్య‌స్ట్ క‌లెక్ష‌న్ల‌తో పాటు ఎన్నో రికార్డులను సాధించిన మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమాల్లో బాలయ్య, మోహిని కలిసి శ్రీకృష్ణదేవరాయలు కాలానికి వెళ్తారు. అందులో శ్రీకృష్ణదేవరాయల పాత్ర కోసం మొదటిగా మూవీ టీం కమల్ హాసన్‌ను అనుకున్నారట.

కమల్ హాసన్ దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. కానీ చివరి నిమిషంలో వేరే సినిమాకు కాల్ షీట్లు సడన్గా అడ్జస్ట్ చేయాల్సి వచ్చి.. కమల్ హాసన్ ఆదిత్య 369 సినిమా నుంచి తప్పుకున్నాడట. చివ‌ర‌కు బాల‌య్యే ద్విపాత్రాభిన‌యం చేసేశారు. దీంతో మనం బాలయ్య సూపర్ హిట్ సినిమాలో కమలహాసన్ కాంబినేషన్‌ని మిస్ అయ్యాం. విచిత్రం ఏంటంటే అదే క‌మ‌ల్ కూతురు శృతీహాస‌న్ బాల‌య్య‌తో వీర‌సింహారెడ్డి సినిమాలో జోడీగా న‌టించింది.