టాలీవుడ్ స్టార్ హీరో అల్లుఅర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ అందుకున్నాడు. ఈ సినిమా ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో రూ.500 కోట్లకు పైగా భారీ కలెక్షన్ అందుకుని అల్లు అర్జున్ కు భారీ స్టార్డమ్ తెచ్చిపెట్టింది. అంతేకాకుండా బన్నీ ప్రస్తుతం పుష్ప2 షూటింగ్లో బిజీగా ఉన్నడు. ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదే క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన్నా కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్తో రష్మిక బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతుంది. అదే సమయంలో దర్శకుడు సుకుమార్ పుష్ప కదాథ రాసుకున్న సమయంలో ఈ సినిమాలో హీరోయిన్గా కొత్త వారిని పెడదామని భావించారట. ఈ క్రమంలోనే అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అయితే ఈ రోల్ కి చక్కగా అనిపిస్తుందని బోనీ కపూర్ కి స్క్రిప్ట్ చెప్పారట .
అయితే కథ విన్న బోనీ కపూర్ మొదటి సినిమాతోనే డీ గ్లామరస్ లుక్ లో జాన్వీ కనిపిస్తే ఆమె ఇమేజ్ డామేజ్ అవుతుందని ..ఈ ప్రాజెక్టు ఆమె చేయదని ముఖాం మీదే చెప్పేసాడు . అయితే ఏ మాత్రం నిరుత్సాహ పడని సుకుమార్ వెంటనే రష్మిక ను అప్రోచ్ అవడం ఆమె ఓకే చెప్పడం.. తర్వాత సినిమా సినిమా తీయడం బ్లాక్ బస్టర్ అవ్వడం చకచకా జరిగిపోయాయి.
ఆశ్చర్యం ఏంటంటే రష్మిక గురించి మాట్లాడుకునే వాళ్ళందరూ పుష్ప సినిమా ముందు పుష్ప సినిమా తర్వాత అంటూ చెప్పుకునే స్థాయికి ఎదిగిపోయింది రష్మిక మందన్నా . ఏది ఏమైనా సరే మంచి ఛాన్స్ మిస్ చేసుకుని ఇప్పుడు తెలుగులో అవకాశాల కోసం డైరెక్టర్స్ అని అడుక్కునే పరిస్థితి ఏర్పరచుకునింది జాన్వీ కపూర్ . దీనంతటికీ కారణం బోనీకపూర్ ఓల్డ్ థింకింగ్ అంటున్నారు జనాలు. ప్రస్తుతం జాన్వీ ఎన్టీఆర్ తో దేవర చేస్తుంది . ఈసినిమాతో అయినా ఈమె కోరీక తిరుతుందో లేదు చూడాలి..?