టాలీవుడ్లో దాదాపు 15 సంవత్సరాల క్రితం మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కెరియర్ను ఆరంభించాడు. కెరీర్ స్టార్టింగ్ లోని మంచి మ్యూజిక్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. అతి తక్కువ టైంలోనే 50 సినిమాలకు మ్యూజిక్ అందించిన రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఇక అఖండ, అల వైకుంఠపురంలో సినిమాలకు థమన్ ఇచ్చిన మ్యూజిక్తో థమన్ నేషనల్ వైడ్గా సూపర్ పాపులర్ అయిపోయాడు.
ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో థమన్ బిజీగా ఉన్నాడు. మ్యూజిక్ క్వాలిటీ విషయంలో థమన్ తడబడుతున్నారని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ. ఇండస్ట్రీ జనాలు కూడా థమన్ అవుట్ ఫుట్పై పెదవి విరుస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ తేజ్ మల్టీస్టారర్కు థమన్ మ్యూజిక్ అంటే అదిరిపోవాలి.
కానీ బ్రో సినిమా నుంచి ఇప్పటివరకు మై డియర్ మార్కండేయ, జాణవులే సాంగ్స్ రిలీజ్ కాగా ఈ రెండు సాంగ్స్ ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకులేకపోయాయి. థమన్ చిన్న చిన్న సినిమాలకి మ్యూజిక్ అందించినట్టు ఈ సినిమాకి అందించాడని.. ఏ మాత్రం కాన్సంట్రేషన్ చేయలేదని వార్తలు వస్తున్నాయి. చిన్నచిన్న మ్యూజిక్ డైరెక్టర్లు సైతం తమ పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఏదేమైనా థమన్ మరింత జాగ్రత్త పడాల్సిన టైం వచ్చింది. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ప్రస్తుతం సరైన అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. కానీ థమన్ రెమన్యురేషన్ చుక్కల్లో ఉంటున్నా సరైన అవుట్ ఫుట్ ఇవ్వడం లేదు. ఇక మహేష్బాబు గుంటూరు కారం సినిమాకు కూడా థమన్ వరస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చాడని మహేష్ కోపంతో ఉన్నాడన్న వార్తలు తెలిసిందే.