ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే ముందుగా గుర్తొచ్చేది దర్శకధీరుడు రాజమౌళి. ఆయన కెరియర్ ఎలా మొదలైందో ఎక్కడి నుంచి మొదలైందో అందరికీ తెలిసిందే. ప్రముఖ స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ కొడుకు రాజమౌళి. సీరియల్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి 2001లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 తో దర్శకుడుగా సినీ రంగానికి పరిచయం అయ్యాడు.
రెండున్నర దశాబ్దల సినీ కెరీర్ లో మొత్తం 13 చిత్రాలు తెరకెక్కించగా… ఇవి ఒక్కదానికి మించి ఒకటి సూపర్ హిట్స్ అయ్యాయి. రాజమౌళి కెరియర్లో డిజాస్టర్ అనేది లేదు. ఎంతోమంది హీరోల సినిమాలకు దర్శకత్వం వహించి అన్ని సూపర్ హిట్లు కొట్టాడు. అలాగే ఇండియాకు ఎన్నోయేళ్ల నుంచిడి కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు “ఆర్ ఆర్ ఆర్ “సినిమాతో తెచ్చిపెట్టాడు.
అలా రాజమౌళి కెరియర్ లో అన్ని సినిమాలు భారీ లాభాలు తీసుకొచ్చినా ఒక సినిమా నష్టాలు మిగిల్చింది. ఆ సినిమా “సై”. నితిన్, జెనీలియా హీరో హీరోయిన్ గా శశాంక్, ప్రదీప్ రావత్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా రాజమౌళి సింహాద్రి తర్వాత తెరకెక్కించారు. ఈ సినిమాను శ్రీ భారత్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఎ. భారతి నిర్మించగా.. కీరవాణి సంగీతాన్ని అందించారు.
కాలేజీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన సై సినిమా సెప్టెంబర్ 23న, 2004న విడుదలైన యావరేజ్ గా ఆడింది. రు. 8 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రు. 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్. కానీ కొన్ని ఏరియాలో బానే ఆడినా… కొన్ని కొన్ని ఏరియాలలో మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు మిగిల్చింది. రాజమౌళి సినిమాలకు ఇలా నష్టాలు మిగిల్చిన సినిమాగా సై నిలిచిపోయింది.