నందమూరి నటసింహం బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో తన క్రేజ్ను మరింతగా పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం భగవంత్కేసరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను డైరెక్టర్ బాబి తో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక తాజాగా బాలకృష్ణ పుట్టినరోజు జరిగిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం బాలకృష్ణ పుట్టిన రోజుకి నారా బ్రాహ్మణి ఎలా సెలబ్రేట్ చేసిందో అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నార్మల్గా చాలామంది సెలబ్రిటీస్ పుట్టినరోజు అంటే పబ్లు, పార్టీలు అంటూ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నారా బ్రాహ్మణి మాత్రం అందుకు చాలా భిన్నంగా ఆలోచించింది. తండ్రి పుట్టిన రోజు సందర్భంగా అలాంటి చెత్త పనులు కాకుండా తల్లిదండ్రులులేని అనాధ పిల్లలకు వెయ్యి మందికి కడుపునిండా భోజనం పెట్టిందట. ఇప్పటివరకు బాలయ్యకోసం తన చిన్న కూతురు తేజస్విని, కొడుకు మోక్షజ్ఞ కూడా అలాంటి పని ఎప్పుడూ చేయలేదు.
దీన్ని బట్టి నారా బ్రాహ్మణికి బాలయ్య పై ఉన్న ప్రేమ గౌరవం అర్థమవుతుంది. అలాగే బ్రాహ్మణి తన తల్లి వసుంధర పుట్టినరోజుకు కూడా ఎంతోమంది పేద పిల్లలకు భోజనం పెడుతుందట. ఆమె ఇప్పుడే కాదు కాలేజీలో చదువుకునే రోజుల్లో కూడా వచ్చిన పాకెట్ మనీ ని దాచి పేదవారి కడుపు నింపడానికే ఉపయోగించేదట. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వినిపించడంతో అంత మంచి పెంపకంలో బ్రాహ్మణి పెరిగింది కాబట్టే ఇప్పుడు అంత పెద్ద స్టేజిలో కొనసాగుతుంది అంటూ నెటిజన్స్ బ్రాహ్మణి పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.