సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన నటించిన సినిమాల్లో “ఒక్కడు” సినిమా ఒక సూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఇప్పటికి ఎప్పటికీ ఒక క్లాసికల్ సినిమాగా ఉండే ఒక్కడు సినిమాలో కొండారెడ్డి గురుజును డైరెక్టర్ ఎంత ఫేమస్ చేశాడో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ తాజాగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కొండ రెడ్డి గురుజును హైలెట్ చేశారు. ఒక్కడు సినిమా గురించి మాట్లాడిన ప్రతి ఒక్క సారి ప్రతి ఒక్కరు మహేష్ బాబు, భూమిక, ప్రకాష్ రాజు గురించి వారి నటన గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు.
కానీ సినిమాలో మరో అద్భుతమైన పాత్రకి కూడా ప్రాధాన్యత ఉంది. అదే తెలంగాణ శకుంతల పాత్ర. ఈ సినిమాలో శకుంతల ఎక్కువసేపు కనిపించరు కానీ కనిపించిన 5,6 సన్నివేశాల్లోనే ఆ===మె చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ కు అప్పట్లో విజిల్స్ మారుమ్రోగిపోయాయి. ఈ సినిమాలో శకుంతల ప్రకాష్ రాజ్తో” నీవల్ల కాకపోతే చెప్పు జమ్మలమడుగు నుంచి ఓ లారీ ఆళ్లగడ్డ నుంచి ఓ లారీ దింపేస్తాను ” అంటూ చెప్పిన డైలాగులుకి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి.
నిజానికి ఒక్కడు సినిమాలో తెలంగాణ శకుంతల పాత్ర లేకపోయినా సినిమా సక్సెస్ అవుతుంది కానీ ఈ పాత్రను అద్భుతంగా తీసి మంచి నటిని డైరెక్టర్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు నవ్విస్తూనే , మరో ఎమోషనల్ సినిమాలతో ఏడిపించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇక తెలంగాణ శకుంతల ఒక్కడు సినిమాలో డైలాగులు చెప్పే సమయంలో మహేష్ బాబు కూడా ఆమెను చూసి షేక్ అయిపోయారట. అంత పవర్ఫుల్ గా డైలాగులను వదిలేదట శకుంతల.