ఎవరికైనా వయసు పెరుగుతుంది.. కానీ మహేష్ భార్య నమ్రతకు మాత్రం తగ్గుతున్నట్టు ఉంటుంది. నమ్రతా శిరోద్కర్ వయసు 51 ఏళ్లు వచ్చినా కూడా తన ఫోటో షూట్లతో 25 ఏళ్ల అమ్మాయిలాగా కనిపిస్తుంటుంది. తాజాగా నమ్రత ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నమ్రత అలా చేయడమే ఆలస్యం లైకులు, కామెంట్ల వర్షం కురిపించారు.
ఆమె టీ షర్ట్, ఫ్యాంట్ ధరించి తన కొత్త లుక్ లో దర్శనమిచ్చింది. ఈ వయస్సులో కూడా నమ్రత అందం ముందు ఏ హీరోయిన్ సరిపోదన్నట్టు తన స్టైల్ చూపించింది. నమ్రతకి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇంతయంగ్గా కనిపించడానికి కారణం ఏమిటంటే… క్రమశిక్షణతో కూడిన జీవన విధానం. ప్రతిరోజు పొద్దున్నే లేవగానే జిమ్కి వెళుతుందట.
అలాగే ఆహారం విషయంలో పక్కా రూల్స్ పాటిస్తుందట. ఇక మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటు ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్తో ఉంటుందట. ముంబైలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మహేష్ బాబుని వివాహం చేసుకొని తెలుగింటి కోడలు అయింది. మహేష్ బాబు కోసం తన కెరీర్ వదిలేసుకుని గృహిణిగా ఉండిపోయింది.
మహేష్ బాబు సినిమాల్లో బిజీగా ఉండడంతో కుటుంబ బాధ్యతలు అన్నీ తనే చూసుకుంటుంది. మహేష్ బాబుకి నమ్రత శిరోద్కర్ అంటే చాలా ఇష్టం. అందువల్ల నమ్రత తనకంటే వయసులో పెద్దదైన కూడా వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ 2005 ఏప్రిల్ 10న పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు సితారతో పాటు కుమారుడు గౌతమ్ ఉన్నారు.