మౌనిక బేడి.. శ్రీకాంత్ హీరోగా నటించిన తాజ్ మహల్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో తరువాత శివయ్య, సోగ్గాడి పెళ్ళాం, సర్కస్ సత్తిపండు, చూడాలని ఉంది, స్వీట్ డాన్సర్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సురక్ష సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మౌనిక అక్కడ అవకాశాలు రావడంతో బీటౌన్లోనే సెటిల్ అయిపోయింది.
బాలీవుడ్ బిగ్బాస్ సీజన్ 2లో ఈమె పాల్గొంది. ఆ తర్వాత వచ్చిన రియాల్టీ షోస్ జలక్ తికలాజ సీజన్ 3, దేశి గర్ల్ షోలలో పాటిస్పేట్ చేసింది. ఇటీవల మౌనిక బేడి సోషల్ మీడియా వేదికపై ఓ ఆసక్తి విషయాన్ని షేర్ చేసుకుంది. గతంలో దర్శకుడు సుభాష్ ఘై హోలీ పార్టీలో రాకేష్ రోషన్.. నా దగ్గరకు వచ్చారని అతడు ఒక యాక్టర్ అన్న విషయం నాకు తెలుసు… అతడు కొన్ని సినిమాల్లో నటించడం తెలుసు.. చూశాను. కానీ అతడు దర్శకుడు, ప్రొడ్యూసర్ అన్న సంగతి తెలియదని… అతడు కాసేపు మాట్లాడాక విస్టింగ్ కార్డు ఇచ్చి రేపు ఒకసారి నన్ను కలవమని చెప్పినట్టు మౌనిక తెలిపింది.
అతడు అలా ఎందుకు ? అన్నాడో నాకేం అర్థం కాలేదు.. ఇతడిని నేను ఎందుకు ? కలవాలి అని ఆ కార్డు ముక్కలు ముక్కలు చేసి పడేసాను.. కొన్ని నెలల తరువాత నా మేనేజర్ ఎందుకు ? రాకేష్ ను కలవలేదు అని అడిగాడు.. అతడు కరణ్ అర్జున్ సినిమా చేస్తున్నాడు.. ఇందులో నీకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నాడు. సల్మాన్ ఖాన్ సరసన మమత కులకర్ణీ ప్లేస్ లో నువ్వు నటించాల్సింది.. ఆ ఛాన్స్ నువ్వే మిస్ చేసుకున్నావ్ అని చెప్పాడు.
అప్పుడు కానీ నాకు నా తప్పు అర్థం కాలేదని వాపోయింది. ఆ తర్వాత నటుడు, డైరెక్టర్ మనోజ్ కుమార్ కూడా తన కొడుకుతో తీస్తున్న సినిమా కోసం నా దగ్గరకు వచ్చాడు.. నేను పిచ్చ హ్యాపీ ఫీలయ్యాను.. అయితే తన సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదని అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నాడు..ఆ సినిమా వర్కౌట్ కాలేదు.. దీని వల్ల నేను ఒక సంవత్సరంపాటు ఇంట్లో ఖాళీగా ఉండాల్సి వచ్చిందని..చివరకు నా పరిస్థితి అర్థం చేసుకుని మనోజ్ నాకు ఆ ప్రాజెక్టు నుంచి విముక్తి కల్పించాడని చెప్పుకొచ్చింది.