పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబోలో రాబోతున్న “బ్రో ” సినిమా ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సినిమాకి కోలీవుడ్ దర్శకుడు, సీనియర్ నటుడు అయిన సముద్రఖని దర్శకత్వం వహించారు. తమిళంలో సూపర్ హిట్ సినిమా “వినోదయ సీతం” రీమేక్ గా బ్రో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడుగా కనిపిస్తాడట.
అందుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్, లుక్స్ అదిరిపోయాయి. ఈసారి మామ అల్లుళ్లు కలిసి బ్లాక్ బస్టర్ కొట్టాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాకి పవన్ 25 రోజులు మాత్రమే డేట్లు ఇచ్చాడంట. అందుకే బ్రో సినిమాలో పవర్ స్టార్ పాత్ర చాలా తక్కువగా ఉంటుంది.
ఈ సినిమా మొత్తం రన్ టైం 135 నిమిషాలకు కాస్త అటూ ఇటూగా ఉంటుందని తెలుస్తోంది. దాదాపు పవన్ గంటన్నర సేపు మాత్రమే కనిపిస్తాడట. ఈ సినిమా రీమేక్ అయినా తెలుగు నేటివిటికి తగ్గట్టుగా పవర్ స్టార్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని చాలా మార్పులు చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అందువల్ల థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదని అంటున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించిన సంగతి తెలిసిందే.