‘ బ్రో ‘ క్లైమాక్స్‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడా.. గుండెల్ని పిండేసే సెంటిమెంట్ ట్విస్ట్‌..!

పవన్ కళ్యాణ్ – మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో మల్టీస్టారర్‌గా తెర‌కెక్కుతున్న‌ సినిమా బ్రో. తమిళ్ డైరెక్టర్, యాక్టర్ సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించబడింది. ఈ సినిమా తమిళ్ మూవీ వినోదయ సీతంకు రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. అదే కథని పవన్ కళ్యాణ్ క్రేజ్‌కి తగ్గ విధంగా మలిచి త్రివిక్రమ్ ఇచ్చిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో బ్రో సినిమా తెర‌కెక్కించారు. బ్రో ఈనెల 28న రిలీజ్ చేస్తున్నారు.

ఈ ఇద్ద‌రు మెగా హీరోల‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోయాయి. సినిమా ఫస్ట్ గ్లింప్స్, టీజర్ రిలీజై మంచి రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. తాజాగా ఈ సినిమాలో మై డియర్ మార్కండేయ సాంగ్ రిలీజై మొదట్లో అంతగా స్పందన లేకపోయినా మెల్లమెల్లగా పిక‌ప్ అవుతూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది.

ఇటీవల రిలీజైన‌ ఈ సాంగ్ మేకింగ్ వీడియోలో పవన్ కళ్యాణ్ ఎంతో హుషారుగా ఉన్నాడు. మొదట్లో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 45 నిమిషాలు కనిపిస్తాడంటూ వార్తలు వినిపించాయి. రీసెంట్గా రౌడీ గెటప్ లో ఉన్న పోస్టర్ రిలీజ‌య్యాక ఈ సినిమాలో ప‌వ‌న్‌ దాదాపు 95 నిమిషాలు కనిపిస్తాడ‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయింది. ఈ సినిమాలో చివరి 30 నిమిషాల్లో సాయి ధరంతేజ్ సూసైడ్ చేసుకొని చనిపోతాడట.

ఈ క్లైమాక్స్ మొత్తం గుండెలను పిండేసేలా ఉంటుందని.. ఫ్యామిలీ ఆడియన్స్ కచ్చితంగా ఏడ్చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్‌తో సాగుతూ క్లైమాక్స్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ప్రేక్షకులు కట్టిపారేసేలా ఉంటుందట‌. పవన్ కళ్యాణ్ కెరియర్లో ది బెస్ట్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుందని మేక‌ర్స్ ధీమాతో ఉన్నారు.