చిన్నప్పుడు మన టీవీలలో రస్నా యాడ్ వచ్చేది. అందులో ఓ చిన్న పిల్లను మనం ఇప్పటకీ అలాగే గుర్తు పెట్టుకుంటాం. ఆ రస్నా బేబీ ఎవరో కాదు తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అంకిత. తెలుగులో ఎన్నో హిట్ సినిమాలలో నటించిన అంకిత… ఆ తర్వాత స్టార్ హీరోలకు జోడీగా కూడా నటించింది. ఆ తర్వాత అంకిత ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలో నటించింది. సింహాద్రి ఒక్కసారిగా బ్లాక్బస్టర్ అవ్వడంతో అంకిత పేరు చీమచీమ అంటూ మార్మోగింది.
ఆ సినిమా అంత హిట్ అయినా కూడా ఎందుకో ? అంకితకు ఆ తర్వాత వరుస అవకాశాలు రాలేదు. ఆ తర్వాత యంగ్ హీరోలు నవదీప్ సరసన మనసుమాట వినదు, గోపీచంద్కు జోడీగా రారాజు, రవితేజతో ఖరత్నాక్ సినిమాల్లో నటించింది. నవదీప్కు జోడీగా ఆమె నటించినప్పుడు కొన్ని రూమర్లు వినిపించాయి. నవదీప్ను ఆమెను లైం…గా టార్చర్ పెట్టాడని.. అంకిత అందుకు ఒప్పుకోలేదని.. నవదీప్ వల్లే ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరమైందన్న ప్రచారం అయితే జరిగింది.
అయితే చాలా యేళ్ల తర్వాత అంకిత తన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. తనకు నవదీప్తో ఎలాంటి విబేధాల్లేవని స్పష్టం చేసింది. నవదీప్ సినిమాతో పాటు తమిళంలో మరో సినిమా ఒకేసారి చేయడంతో తాను ఒత్తిడి ఫీలయ్యానని చెప్పింది. ఆ టైంలో అసహనానికి గురయ్యానే తప్పా ఎలాంటి విబేధాలు లేవని చెప్పింది.
ఇక బాలయ్యతో చేసిన విజయేంద్రవర్మ మూవీపై తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని.. ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే తనకు మరిన్ని అవకాశాలు వచ్చేవని తెలిపింది. ఇక దివంగత తారలు ఉదయ్కిరణ్, ఆర్తీ అగర్వాల్ ఇద్దరూ తనకు మంచి స్నేహితులు అని.. వారి జీవించి ఉంటే బాగుండేదని చెప్పింది.