కొన్ని చిత్రాలు ఒక ఏజ్ గ్రూప్ వాళ్లకు తెగ కనెక్ట్ అయిపోతుంటాయి, ఎన్నేళ్లు అయినా ఆ సినిమాలకు క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే ఆ సినిమాలు చూసినప్పుడు మన జీవితంలో జరిగిన కొన్న సంఘటనలు లాగా అనిపిస్తాయి. అలాంటి సినిమాలలో విక్టరీ వెంకటేష్ నటించిన ‘ఆడవారి మాటలకు.అర్థాలే వేరులే’ సినిమా ఒకటి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పట్లో ఈ సినిమా ప్రభాస్ మున్నా సినిమాతో పోటీ పడింది.
మున్నా సినిమా ఫ్లాప్ అవ్వగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ రోజుల్లోనే ఈ సినిమా రు. 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం లో తండ్రి కొడుకుల అనుబంధం, అలాగే ప్రేయసి కోసం ఆరాధన ఇలాంటివన్నీ సెంటిమెంట్ పరంగా ఈ సినిమాను క్లిక్ చేశాయి. అందుకే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
తమిళంలో ఎన్నో సినిమాలు చేసిన సెల్వ రాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు. తెలుగు తర్వాత తమిళం లో కూడా ఈ సినిమా రీమేక్ చేశారు. తమిళంలో త్రిష కి బదులుగా నయనతార నటించింది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తమిళంలో మాత్రం పెద్దగా ఆడలేదు. ఈ సిపిమా మొదట్లో వెంకటేష్ తో చెయ్యాలని అనుకోలేదట. ఈ సినిమాలో వెంకటేష్ కంటే ముందు అల్లు అర్జున్ నటించాలనుకున్నారంట.
అల్లు అర్జున్ కి స్టోరీ వినిపించగా ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది కానీ, సెకండాఫ్ నచ్చలేదట. దీంతో తాను ఈ సినిమా చెయ్యనని చెప్పారట. ఇదే స్టోరీని కొన్ని రోజుల తర్వాత వెంకటేష్ కి చెప్పగా వెంకటేష్ పూర్తి కథ విని తనుకు బాగా నచ్చడంతో ఒకే చెప్పాడట. ఈ చిత్రంలోని కొన్ని పాటలు ఇప్పటికీ జనాల నోళ్లలో నానుతుంటాయి.