“గుంటూరు కారం” సినిమా అసలు స్టోరీ లీక్.. ముందు అనుకున్న టైటిల్ అందుకే మార్చేశారా..!

టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమా గుంటూరు కారం. శ్రీ లీల, పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎంపిక‌య్యారు. తాజాగా పూజహెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే దీనిపై ఈ సినిమా టీం ఇంకా స్పందించలేదు. ఇప్పటికే త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్‌లో రెండు సినిమాలు రాగా ఇది మూడో సినిమా.

ఈ సినిమా సెట్స్ పైకి వచ్చిన దగ్గరనుంచి సినిమా నుంచి ఏదో ఒక విషయం లీక్ అవుతూనే ఉంది. ఇక తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గుంటూరు కారం అనే టైటిల్ పెట్టక ముందే ఈ సినిమాపై అనేక రకాల పుకార్లు వైరల్ అయ్యాయి. అర్జునుడు, అతడే పార్ధు, అమరావతికి అటు ఇటు లాంటి ఎన్నో టైటిల్స్ త్రివిక్రమ్ పరిశీలించినట్టు వార్తలు వినిపించాయి.

ఫైనల్‌గా అమరావతికి అటు ఇటు ఫిక్స్ చేయాల‌నుకున్నార‌ట‌ మూవీ టీం. ఎందుకంటే త్రివిక్ర‌మ్ సినిమాల టైటిల్స్ అన్నీ కూడా అ అక్ష‌రంతో స్టార్ట్ అవుతాయి. అయితే చివ‌ర్లో గుంటూరు కారం టైటిల్ తెర‌పైకి తీసుకువచ్చారు. ఇంతకీ టైటిల్ మార్చడానికి గల కారణం ఏంటంటే.. అమరావతికి అటు ఇటు అని టైటిల్ వెనక అసలు స్టోరీ లైను ఉంద‌ట‌.

ఈ సినిమాలో మహేష్ బాబు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉంటార‌ని.. అత‌డి తల్లిదండ్రులు ఇద్దరు విడాకులు తీసుకుని మహేష్ బాబుకు అటు ఒకరు.. ఇటు ఒకరు అన్న‌ట్లు నివసిస్తూ ఉంటారట. దీంతో సినిమాకి అమరావతికి అటు ఇటు అని టైటిల్ పెడదాం అనుకున్నారు. కానీ స్టోరీ లైన్ అదే క‌దా అనే ఉద్దేశ్యంతో టైటిల్ మార్చి గుంటూరు కారం పేరుతో షూటింగ్ పూర్తి చేస్తున్నారు మూవీ టీం.