ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా. ఇండస్ట్రీలోకి రావాలంటే అందాలని ఆరబోస్తూ పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటేనే కాదు.. నటన కూడా ఉంటేనే ఇండస్ట్రీలో సినిమా ఆఫర్లు వస్తాయి. అలాగే ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఆమె కెరియర్ ప్రారంభంలోనే తన నటనతో నేషనల్ అవార్డు గెలుచుకుంటుంది. తెలుగు, తమిళం భాషల్లో దాదాపు అందరి స్టార్ హీరోలతో జంటగా నటించింది. ఆమె మరెవరో కాదు ప్రియమణి.
2003లో “ఎవరే అతగాడు” అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయింది. ఈ సినిమాలో సీనియర్ నిర్మాత కేఎస్. రామారావు తనయుడు అలెగ్జాండర్ వల్లభ హీరోగా నటించారు. ఆ తర్వాత తమిళం, మలయాళం తో ఫుల్ బిజీ అయిపోయింది. తెలుగులో జగపతిబాబుతో జతకట్టి “పెళ్లయిన కొత్తలో” సినిమాలో నటించగా.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి ప్రియమణి కెరర్ను టర్న్ చేసేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ యమదొంగ సినిమాలోనూ జోటీ కట్టింది.
ఈ సినిమా బాగా క్లిక్ అవ్వడంతో టాలీవుడ్, కోలీవుడ్లో ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. కెరీర్ ఆరంభంలోనే ప్రియమణికి మంచి గుర్తింపు వచ్చింది. ఎన్ని అవకాశాలు వచ్చినా టాలీవుడ్ ఇండస్ట్రీ ని వదులుకోలేదు. ఆ సమయంలో షారూఖ్ ఖాన్ స్పెషల్ రిక్వెస్ట్ చేయడంతో ఆమె “చెన్నై ఎక్స్ప్రెస్” చిత్రంలో ఐటెం సాంగ్లో నటించింది.
ఇప్పుడు కూడా ప్రియమణి షారుఖ్ ఖాన్ నటించిన “జవాన్” చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఈ సినిమా హిట్ అయితే ప్రియమణి క్రేజ్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఇంకా రీసెంట్గా ఆమె నాగచైతన్య హీరోగా నటించిన “కస్టడీ” చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. వీటితో పాటుగా తమిళ్ సినిమాల్లో కూడా దూసుకుపోతుంది ప్రియమణి. ఇక ఆమె కర్నాకటకు చెందిన ముస్తఫా రాజ్ను ఆమె పెళ్లాడి ఫ్యామిలీ లైఫ్ ఎంచక్కా ఎంజాయ్ చేస్తోంది.