బాలయ్య ‘ సమరసింహారెడ్డి ‘ చూసి ఈ సినిమా నేను మిస్ అయ్యాన‌ని బాధ‌ప‌డ్డ స్టార్ హీరో..!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్స్ లో నటించాడు. ఎన్నో వైవిధ్య పాత్రను పోషించి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. బాలయ్య ,బి గోపాల్ కాంబినేషన్ ఎంత సూపర్ హిట్ కాంబినేషన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బి గోపాల్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా ” లారీ డ్రైవర్ ” తర్వాత ” రౌడీ ఇన్స్పెక్టర్ ” సినిమా తెర‌కెక్కింది.

ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఆ తర్వాత వారి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ” సమరసింహారెడ్డి ష‌. ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో న్యూ ట్రెండ్ సెట్ట‌ర్ గా మారింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తర్వాత తెలుగులో ఫ్యాక్షన్ జాన‌నార్ సినిమాలు క్యూ కట్టాయి. దాదాపు తెలుగు స్టార్ హీరోలు అందరూ ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమాల్లో నటించి సక్సెస్ సాధించారు.

టాలీవుడ్‌లో ఫ్యాక్ష‌న్ సినిమాల ఒరవడి మొదలవడానికి సమరసింహారెడ్డి సినిమాయే కారణం. విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ పవర్ఫుల్ డైలాగులు అందించారు. 1999 జనవరి 13న విడుదలైంది. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమాల రికార్డులు అన్నిటిని బ్రేక్ చేసింది. రూ.6 కోట్లు బడ్జెట్ తో రిలీజైన‌ ఈ సినిమా బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టి రూ.20 కోట్ల భారీ వసూళ్లను కొల్లగొట్టింది.

ఈ సినిమాను చూసిన వెంకటేష్ ఈ సినిమాను నేను చేసి ఉంటే బాగుండేది అనుకున్నాడట. అదే టైంలో ఎస్ శంకర్ ” జయం మనదేరా ” అనే ఫ్యామిలీ ఫ్యాక్షన్ క‌థ‌తో వెంకటేష్ వద్దకు వెళ్ళాడు. వెంకటేష్‌కి ఆ కథ నచ్చడంతో అది ఫ్యాక్షన్ నేప‌థ్యం ఉన్న క‌థ‌ కావడంతో ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ” సమరసింహారెడ్డి ” విడుదలైన సంవత్సరానికి ” జయం మనదేరా ” సినిమా రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రకంగా వెంకటేష్ ” సమరసింహారెడ్డి ” కోరికను ” జయం మనదేరా ” సినిమాతో తీర్చుకున్నాడు.