తెలుగులో అతిపెద్ద రియాల్టీషోగా ప్రతి సీజన్లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంటుంది బిగ్ బాస్. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తికాగా మొదటి జరిగిన 5 సీజన్లు సూపర్ హిట్ గా నిలిచాయి. 6వ సీజన్ బిగ్ బాస్ ప్రేక్షకులను సరిగ్గా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ షో డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఓటీటీలో వచ్చిన బిగ్బాస్ కూడా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు.
దీనికి కారణం ఈ సీజన్లో ఎలిమినేషన్ నిజాయితీగా జరగకపోవడమేనని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఈసారి కచ్చితంగా ఎలిమినేషన్ విషయంలో జాగ్రత్తలు పాటించే విధంగా స్టార్ మా నిర్ణయం తీసుకుందట. ఇక బిగ్బాస్ సీజన్ 7 కి కూడా నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడట. ఇప్పటికి ఈ సీజన్ లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్లు ఫిక్స్ అయిపోయారంటూ సోషల్ మీడియాలో కొందరు సెలబ్రిటీస్ నేమ్స్ వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ బిగ్బాస్ 7 లో సెలెక్ట్ అయిన కంటెస్టెంట్లు ఎవరో ? ఒకసారి చూద్దాం. బుల్లితెరపై సీరియల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తూ పాపులారిటీ సంపాదించుకుని రియల్ లైఫ్ లో భార్యాభర్తలుగా మారిన అమరదీప్ – తేజస్విని ఇద్దరూ జంటగా ఈ షోలో అడుగుపెట్టబోతున్నారు. అలాగే బిగ్బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా చేసిన నోయల్ మరోసారి తన మాజీ భార్య, హీరోయిన్ ఎస్తేర్తో ఈ షో లో కంటెస్టెంట్ కాబోతున్నాడట.
ఇక గతంలోనూ రియల్ భార్య భర్తలు అయిన హీరో వరుణ్సందేశ్, అతడి భార్య వితికా షెరు కూడా బిగ్బాస్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. కార్తీకదీపం సీరియల్ విలన్ రోల్ ప్లే చేసి పాపులారిటీ సంపాదించుకున్న శోభాశెట్టి, ఢీ షో పండు, జబర్దస్త్ షో అప్పారావు, కాళిదాసు మహేష్ బాబు, మోహిత్ శోభ రాజు, శోభన్ కొమండూరి, సాయి రోనాక్, సిద్ధార్థ వర్మ , బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ కంటెస్టెంట్లుగా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇక సీజన్7 ప్రేక్షకుల ముందుకు వచ్చి పాపులారిటీ సంపాదించుకుంటుందో? లేదో? చూడాలి.