ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది. టప్ మోస్ట్ సెలబ్రిటీస్ కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసి మరింత క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది నటీనటులు మల్టీ స్టారర్ సినిమాల్లో నటిస్తూ పాపులారిటీ పెంచుకుంటున్నారు. రామ్ చరణ్, తారక్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ కి ఏకంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ షేక్ అయ్యేలా ఆస్కార్ అవార్డ్ దక్కింది.
ఈ క్రమంలో ఎప్పటి నుంచో చిరంజీవి చిరకాల కోరికను పాన్ ఇండియా క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీర్చేస్తున్నట్టు టాక్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిరంజీవి – రామ్ చరణ్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమవుతోంది. కేవలం మెగా అభిమానులే కాదు.. ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ కోరికే కోరుకుంటున్నాయి. చిరంజీవి – రామ్ చరణ్ ఓకే స్క్రీన్ పై కనిపించాలనేదే మెగా అభిమానుల ఆశ.
ఆచార్య సినిమాలో వీళ్ళు కలిసి నటించినా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అందువల్ల వీరిద్దరూ కాంబోలో ఇంకో సినిమా తీసి హిట్ కొట్టాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ కోరిక నేను తీరుస్తా అంటూ ముందుకు వచ్చాడు ప్రశాంత్ నీల్. త్వరలోనే మెగాస్టార్, రామ్ చరణ్తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ క్రేజీ మల్టీస్టారర్ ప్రకటన త్వరలోనే రాబోతుంది. సలార్ 2 సినిమా కంప్లీట్ అవ్వగానే ఈ సినిమా స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ 31 సినిమా పూర్తయ్యే సమయానికి ఇది పట్టాలు ఎక్కే ఛాన్సులు ఉన్నాయి. ఏదేమైనా మరోసారి చరణ్, చిరు కలిసి నటిస్తే మెగాఫ్యాన్స్కే కాదు టాలీవుడ్కే పూనకాలు లోడింగ్ అవుతాయి.