మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఐశ్వర్యరాయ్ ముందుగా మలయాళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మోహన్ లాల్ హీరోగా నటించిన ఇద్దరు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమాకు సీనియర్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించారు.
ఐశ్వర్య మొదటి సినిమా అవకాశం స్టార్ హీరోతో రావడం.. ఆ సినిమా హిట్ అవడంతో ఆ తరువాత వరుస అవకాశాలు తన ఖాతాలో వేసుకుని స్టార్డం సంపాదించుకుంది ఐశ్వర్య. ఆ తర్వాత బాలీవుడ్లో అవకాశాలు రావడంతో బాలీవుడ్కి వచ్చి అక్కడే సెటిలైంది. ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఐశ్వర్య కొనసాగుతూనే ఉంది. అతి తక్కువ కు టైం లోనే ఇండియన్ స్టార్ హీరోయిన్గా మారిన ఐశ్వర్య తన కెరీర్ లో ఒకే ఒక తెలుగు సినిమాలో మాత్రమే నటించి ప్రేక్షకులను మెప్పించింది.
అది కూడా సినిమా మొత్తం కాదు.. కేవలం ఒక స్పెషల్ సాంగ్లో మాత్రమే కనిపించింది. 1999లో నాగార్జున హీరోగా తెరకెక్కిన రావోయి చందమామ సినిమాలో ఓ పాటలో ఐశ్వర్యారాయ్ నటించింది. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ ఆ పాటలో నటించడానికి వెనుక ఒక కథ ఉందట. ఈ సినిమా దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఐశ్వర్య రాయ్ ఫ్యామిలీకి మంచి స్నేహితుడు.
రావోయి చందమామ షూటింగ్ టైంలో ఈ సాంగ్ చేసేందుకు శిల్పాశెట్టి ని కలవడానికి వెళ్లిన జయంత్ ఐశ్వర్యారాయ్ ని కూడా కలిశాడట. అప్పుడు ఐశ్వర్య మీ సినిమాల్లో ఇతర హీరోయిన్లను నటించమని అడుగుతున్నారు.. నన్ను మాత్రం ఎందుకు? అడగరు అని ప్రశ్నించిందట. దాంతో శిల్పాశెట్టి పేరు వెంటనే మార్చేసి ఆ సాంగ్లో ఐశ్వర్యని పెట్టి డ్యాన్స్ చేయించాడట జయంత్. ఇలా ఐశ్వర్య కూడా ఆ ఒక్క సాంగ్లో మాత్రమే డైరెక్టుగా తెలుగులో కనిపించింది.
వైజయంతీ మూవీస్ బ్యానర్పై అగ్ర నిర్మాత చలసాని అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాలో అంజలా ఝవేరి హీరోయిన్గా నటించగా.. కీర్తిరెడ్డి మరో హీరోయిన్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేదు.