బాల‌య్య 109లో ఇద్ద‌రూ ఎన్టీఆర్ హీరోయిన్లే ఫిక్స్‌… ఇదేం కాంబినేష‌న్‌రా కేక పెట్టించాడు..!

బాలయ్య ఈ పేరు చెపితేనే జ‌నాల్లో ఓ వైబ్రేష‌న్ ఉంటుంది. టాలీవుడ్ నటసింహం నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తరగదు. యంగ్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తూ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు బాలయ్య. రీసెంట్ గానే వీర‌సింహారెడ్డి తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బాలయ్య. ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాడు.

ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, యాక్షన్ డ్రామాగా ఈసినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో బాలయ్య సరికొత్త గెటప్ తో కనిపించాడు. అంతే కాదు ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో బాలయ్య మాస్ స్టెప్పులు వేస్తున్నాడ‌ట‌. ఇదంతా ఒక ఎత్తు అయితే బాల‌య్య త‌ర్వాత బాబితో చేసే సినిమాలో అందాల ముద్దుగుమ్మలు నయనతార, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా సెలెక్ట్ అయినట్టు ప్రచారం జరుగుతుంది.

బాల‌య్య‌కు జోడీగా వీరిద్ద‌రు న‌టిస్తే అది క్రేజీ కాంబినేష‌నే. గ‌తంలో బాల‌య్య – న‌య‌న‌తార కాంబినేష‌న్లో వ‌చ్చిన సింహా, శ్రీరామ‌రాజ్యం, జై సింహా అన్ని హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు వీరి కాంబినేష‌న్లో నాలుగో సినిమా అవుతోంది. ఇక ర‌కుల్‌ప్రీత్ సింగ్‌తో బాల‌య్య‌కు ఇదే ఫ‌స్ట్ సినిమా. విచిత్రం ఏంటంటే న‌య‌న‌తార‌, ర‌కుల్ ఇద్ద‌రూ అబ్బాయి ఎన్టీఆర్‌తో న‌టించి సూప‌ర్ హిట్లు ఇచ్చారు.

మ‌రి ఇప్పుడు ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తోన్న ఈ సినిమాతో బాబాయ్ బాల‌య్య‌కు హిట్ వ‌స్తుందో ? లేదో ? చూడాలి. ఇక ఈ సినిమా డైరెక్ట‌ర్ బాబి ఈ యేడాది సంక్రాంతికి వ‌చ్చిన వాల్తేరు వీర‌య్య‌తో హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే.