క్రికెటర్లలో బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ సంపాదించిన వారిలో మహేంద్రసింగ్ ధోని ఒకడు. ఇప్పటికి బుల్లెట్ వేగంతో దూసుకొచ్చే బంతులను మైండ్ బ్లోయింగ్ క్యాచ్లుగా మలిచే ధోనీ క్విజ్ లో బ్యాట్ తో నిలబడితే హెలికాప్టర్ షార్ట్ తో బాల్ బౌండరీ అవతల పడాల్సిందే ఆ విధంగా క్రికెట్లో తన సత్తాను చాటుకున్నాడు.
క్రికెట్తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ధోని ఇప్పుడంటే సాక్షిని పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడై బుద్ధిగా ఉంటున్నాడు కానీ.. పెళ్లికాకముందు ఎంతోమంది హీరోయిన్స్ తో ఎఫైర్లు నడిపాడట. ఇటీవల 42వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకున్న సందర్బంగా ధోని గురించి ప్రస్తుతం ఈ వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
దీపిక పదుకొనే :
ఇండస్ట్రీకి పరిచయమైన కొత్తలో ఓం శాంతి ఓం సినిమా షూటింగ్ టైంలో ఎక్కడ చూసినా ధోనితో కలిసి తిరుగుతూ చట్టపట్టలేసుకొని కనిపించేది దీపికా పదుకొనే. యువరాజ్ సింగ్ – మాహి మధ్య గొడవలకు కూడా దీపికా పదుకొనే కారణమైందని వార్తలు వచ్చాయి. ధోనిని ప్రేమించాను అంటూ యువరాజ్ సింగ్ తో క్లోజ్ గా ఉండడం అలాగే ఒక సందర్భంలో దీపిక పదుకొనే యువరాజ్ సింగ్కి ముద్దు పెట్టడం చూసి తట్టుకోలేని ధోని దీపిక పదుకొనే కి బ్రేకప్ చెప్పేశాడట. అలాగే యువరాజ్ సింగ్ తో ధోనీకి శత్రుత్వం కూడా ఈ కారణంగానే మొదలైంది అంటారు.
అసిన్ :
పూరి జగన్నాధ్ డైరెక్షన్లో అమ్మానాన్న ఓ తమిళమ్మాయి మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన్న అసిన్ ధోనీతో ప్రేమాయణం నడిపించినట్లు వార్తలు వచ్చాయి. కొంతకాలం తర్వాత ఈ వార్తలకు తెరదించుతూ అసిన్ మైక్రోమ్యాక్స్ సీఈవో రాహుల్శర్మను పెళ్లాడి ఇండస్ట్రీకి దూరమైంది.
లక్ష్మీ రాయ్ :
ఐటమ్ సాంగ్లతో ఫుల్ క్రేజ్లో దూసుకుపోతున్న లక్ష్మీ రాయ్ – మహేంద్రసింగ్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని చాలా రోజుల పాటు వార్తలు వినిపించాయి. వీరిద్దరి మధ్య ఏం జరిగింది వీరిద్దరు నిజంగానే ప్రేమించుకున్నారా అనేదానిపై ఇప్పటికి క్లారిటీ రాలేదు.
ప్రీతి సిమోస్ :
ద కపిల్ షో ప్రోగ్రాం క్రియేటివ్ డైరెక్టర్ గా ప్రీతిసి మోసిన్ పని చేసింది. ధోని, ప్రీతిసిమోస్ సీక్రెట్ డేటింగ్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రీతిసిమోస్ కూడా ఆ సందర్భంలో ధోని అంటే తనకెంతో ఇష్టమని ప్రకటించింది. కానీ ప్రేమ విషయంపై ఇద్దరూ ఏ విధంగా స్పందించలేదు.
ప్రియాంక జా :
ధోని తన వయసులో ప్రియాంక జా ని ప్రేమించాడు. ఈ ప్రేమ వ్యవహారం ఎంఎస్ ధోని సినిమాలో కూడా చూపించారు. అయితే ఈ సినిమాలో పరిచయమైనట్టు ప్రియాంక జా బయట ఏమి విమానంలో పరిచయం కాలేదు. టీనేజ్ లోనే ప్రియాంకను కలిసిన ధోని ఆమె కోసం చాలా దూరం సైకిల్ మీద ప్రయాణించి వెళ్లేవారట. ధోని భారత జట్టుకు ఎంపిక కాకముందే 2002లో ప్రియాంక రోడ్డు ప్రమాదంలో మరణించింది. కేవలం డ్రామా కోసం సినిమాలో కల్పితాలను జత చేశారు.
చివరకు 2010లో సాక్షి సింగ్ రావత్ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఎంఎస్ ధోని – ప్రియాంక రావత్ ధోని పరిచయం కూడా సినిమాల్లో చూపించిన విధంగా గమ్మత్తుగా ఏం జరగలేదు. సాక్షి రావత్ హోటల్ ఇంటర్షిప్ చేస్తున్న టైంలో ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ అయినా హోటల్ మేనేజర్ ధోనిని ఆమెకు పరిచయం చేశాడు. అయితే సాక్షి తన చిన్ననాటి స్నేహితురాలని తెలుసుకున్న ధోని తన నెంబర్ తీసుకుని మెసేజ్లు చేసేవాడు. ఇద్దరి మధ్యన ప్రేమ చిగురించడంతో ధోని సాక్షి రావత్ కి ప్రపోజ్ చేశాడు.