చిరంజీవి సినిమా నుంచి త‌ప్పుకున్న సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌… ఏం జ‌రిగింది.. తేడా కొట్టిందా…!

సిద్దు జొన్నలగడ్డ.. డీజె టిల్లు సినిమాతో టాలీవుడ్ యూత్ ఫ్యాన్స్‌లో ఒక్క‌సారిగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ సినిమా కంటే ముందు గుంటూరు టాకీస్ సినిమా అనుకున్న రేంజ్‌లో స‌క్స‌స్ కాలేదు. సిద్దు తర్వాత ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. సిద్దు నటించిన సినిమాల్లో ” కృష్ణ అండ్ హిస్ లీల ” , ” మా వింత గాధ వినుమా ” సినిమాలు యావరేజ్‌గా నిలిచాయి. ఆ తర్వాత ” డీజే టిల్లు ” సినిమాలో నటించి మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం ఫుల్ యూత్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు సిద్దు. బంగార్రాజు ఫేమ్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో కలిసి చిరంజీవి సినిమా తీయబోతున్నాడని ఈ సినిమాలో చిరంజీవి కొడుకు పాత్రలో సిద్దు పేరు ఫైన‌లైజ్ చేసిన‌ట్టు వార్తలు వినిపించాయి. బంగార్రాజు లాంటి హిట్ సినిమా తర్వాత క‌ళ్యాణ్ తెర‌కెక్కిస్తోన్న సినిమా కావ‌డం.. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగాయి.

ఈ సినిమాకు సిద్దు రూ.4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు కూడా వచ్చాయి. పైగా ఈ సినిమాకు చిరు కుమార్తె సుస్మిత నిర్మాత కావ‌డం మ‌రో ఇంట్ర‌స్టింగ్‌. కాగా తాజాగా సిద్దుకి సంబంధించిన ఒక షాకింగ్ వార్త బయటకు వచ్చింది. సిద్దు, చిరంజీవి కొడుకు పాత్రను చేయడానికి ఆసక్తి చూపడం లేదని.. ఆ సినిమాల్లో త‌న రోల్‌కి ప్రాధాన్య‌త లేద‌నే ఉద్దేశ్యంతో ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో నిజం ఎంతో ? తెలియదు కానీ ప్రస్తుతం ఈ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ సిద్దు పాత్రలో మరో హీరో కోసం వెతుకుతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చిరంజీవి సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్నావా.. నీకు బ్రెయిన్ దొబ్బిందా.. అంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకున్నావు సిద్దు అంటూ నెట్టిజ‌న్స్ కామెంట్ చేస్తున్నారు.