టాలీవుడ్ లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్న సినిమాలలో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టుకే ఒకటి ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి సినిమాలతో వైవిధ్యమైన సినిమా సృష్టికర్తగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అదే వైజయంతీ మూవీస్ బ్యానర్లో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కే సినిమా తెరకెక్కుతోంది.
కచ్చితంగా నాగ్ ఈ సినిమాతో వరల్డ్ వైడ్ గా సరికొత్త విజువల్ వండర్ను ఆవిష్కరించబోతున్నారన్న అంచనాలు అయితే వచ్చేసాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎవరి నోట విన్న ప్రాజెక్ట్ కే పేరు వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ టాలీవుడ్ సీనియర్ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ కు అల్లుడు అన్న విషయం తెలిసిందే.
అశ్వినీదత్ కుమార్తెలు ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మాతలుగా నాని హీరోగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తెరకెక్కింది, ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు, ఈ సినిమా అనూహ్యహ విజయం సాధించింది. ఆ టైంలో ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారి తర్వాత ప్రియాంక – నాగ్ అశ్విన్ మధ్య ప్రేమ చిగురించింది. అయితే అశ్వినీదత్కు తన కుమార్తె ప్రేమ వివాహం. అందులోను కులాంతర వివాహం చేసుకోవడం అసలు ఇష్టం లేదని అంటారు.
అయితే ప్రియాంక మాత్రం తాను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటాను అని పట్టు పట్టడంతో చివరికి ఇండస్ట్రీలో అశ్వినీదత్ సన్నిహితులు ఆయనను ఒప్పించి మరి వారి పెళ్లి చేశారు. ఇక నాగ్ అశ్విన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావటం విశేషం. నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరు అమెరికాలో ఉన్నారు. వారిది అక్కడ బాగా సెటిల్ అయిన కుటుంబం.
నాగ్ మాత్రం డైరెక్టర్ కావాలన్న కోరికతో అమెరికాలో ఫిలిం మేకింగ్ కోర్సు నేర్చుకుని మరి ఇండియాకు వచ్చి ముందు శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక మూడో ప్రయత్నంలోనే ఏకంగా ప్రాజెక్టు కే అంటూ పాను వరల్డ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.