కశ్మీరా షా బాలీవుడ్ సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. హిందీ తో పాటు తెలుగు, తమిళం, భోజ్పురి, మరాఠీ సినిమాలలో నటించింది. ఆ తర్వాత ఆమె బిగ్ బాస్ 1 హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఫియర్ ఫ్యాక్టర్ ఖత్రోన్ ఖిలాడి 4 షోలలో కంటెస్టెంట్ గా పాల్గొంది. 2003లో బ్రాడ్ లిట్టర్మ్యాన్ను పెళ్లాడిన ఈ భామ నాలుగేళ్ల తర్వాత 2007లో తన భర్తకు విడాకులు ఇచ్చేసింది.
అనంతరం 2013లో ప్రముఖ నటుడు, టీవీ హోస్ట్ కృష్ణ అభిషేక్ను ప్రేమ వివాహం చేసుకుంది. బాలీవుడ్లో కశ్మీరా షా – కృష్ణ అభిషేక్ జంటకు మంచి గుర్తింపు ఉంది. కపిల్ శర్మ షోలో ఈ జంట చాలాసార్లు సందడి చేసి బాగా పాపులర్ అయ్యారు. అయితే తాజాగా కశ్మీరా షా సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను పెళ్లయ్యాక పిల్లల కోసం చాలా సార్లు ప్రయత్నించింది అట. అయితే కాశ్మీరా – అభిషేక్ జంట ఎన్నో ఇబ్బందులు పడినా పిల్లలు కలగలేదట.
ఆమెకు మొదటి భర్త ద్వారా కూడా పిల్లలు లేరు. అందుకే తల్లిని అవ్వాలని ఎంతో తాపత్రయ పడేదట. కశ్మీరా గర్భం దాల్చేందుకు ఏకంగా 14 సార్లు ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదట. చివరకు ఐవిఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు ప్రయత్నించిన సక్సెస్ కాలేదని.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇచ్చిన సలహాతో తాను ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లినయ్యానని గర్వంగా చెప్పింది. సల్మాన్ ఖాన్ ఇచ్చిన సలహా మా ఇద్దరి జీవితాలను శాశ్వతంగా మార్చేసింది అంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది కశ్మీరా షా.
సరోగసి ద్వారా బిడ్డను ప్లాన్ చేయాలని సల్మాన్ సలహా ఇచ్చాడట. ఆ సలహాతోనే పెళ్లయిన నాలుగేళ్లకు వీరిద్దరూ ఏకంగా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారట. అయితే కాశ్మీరా గ్లామర్ కోసమే సరోగసి విధానం ద్వారా పిల్లలను కందని కొందరు ట్రోల్స్ కూడా చేశారట. అయితే అలాంటిదేమీ లేదని.. అవన్నీ రూమర్లు మాత్రమే అని కాశ్మీరా కొట్టి పడేసింది. ఏది ఏమైనా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సలహాతో తమ జీవితాల్లో సరికొత్త ఆనందం వెల్లువిరిస్తుందని కాశ్మీరా సంతోషం వ్యక్తం చేస్తోంది.