ప్రస్తుతం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ తో పాటు చాలామంది సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ ఫోటో కానీ, మోక్షజ్ఞ పేరుగాని సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు ఆ వార్తలను తెగ వైరల్ చేస్తున్నారు. సినిమాల్లోకి రాకముందే ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మోక్షజ్ఞ నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడన్న విషయాన్ని ఓ సందర్భంలో బాలయ్య స్వయంగా చెప్పారు.
తాజాగా బాలయ్య ” మోక్షజ్ఞ ” ఎంట్రీ గురించి మరో క్రేజీ అప్డేట్ ఫాన్స్ కు అందించాడు. గతంలో మోక్షజ్ఞ త్వరలోనే ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 సినిమాతో పరిచయం కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఓ ఈవెంట్లో బాలకృష్ణ స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడని కూడా ప్రచారం జరిగింది. రెండేళ్ల క్రితం బాలయ్యే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని చెప్పినా ఇప్పటివరకు మోక్షజ్ఞ సినిమా సెట్స్ పైకి రాలేదు.
వివి. వినాయక్ దర్శకత్వంలో, బోయపాటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందని వార్తలు వినిపించాయి. కథ సెట్ కాక ఈ సినిమాలేవి సెట్స్పైకి రాలేదు. బాలయ్య వారసుడు ఎంట్రీ అంటే ప్రేక్షకులు అంచనాలు మామూలుగా ఉండవు. ఎవ్వరూ ఊహించని రేంజ్లో సినిమా స్క్రిప్ట్ ఉండాలంటే డైరెక్టర్ కూడా కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఈ విషయంలో బాలయ్య చాలా సార్లు కొందరు దర్శకులతో చర్చలు జరిపిన మాట వాస్తవం. తాజాగా అమెరికాలో జరిగిన తానా సభలలో పాల్గొన్న బాలయ్యను అక్కడ ఫ్యాన్స్ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అడిగారట.
మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే కచ్చితంగా ఉంటుందని చెప్పిన బాలయ్య ఒక ట్విస్ట్ కూడా ఇచ్చాడంటున్నారు. ఆదిత్య 999లో మోక్షజ్ఞ ఖచ్చితంగా నటిస్తాడని.. అందులో పూర్తిస్థాయిలో హీరోగా నటించడని.. కేవలం ఒక కీరోల్ మాత్రమే ప్లే చేస్తాడని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు కూడా ఇపట్లో సెట్స్ పైకి వచ్చే అవకాశాలు లేవు. వచ్చేయేడాది ఏపీ ఎన్నికల తర్వాతనే ఈ సినిమాను బాలయ్య సెట్స్ మీదకు తీసుకువస్తాడని సమాచారం. దీంతో బాలయ్య డైరెక్షన్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందని డిసైడ్ అయిపోయారు బాలయ్య ఫ్యాన్స్.