తెలుగు సినిమా చరిత్రను విశ్వవ్యాప్తం చేసిన సినిమాలు ఏవి అంటే కచ్చితంగా బాహుబలి 1, 2 అని చెప్పాలి. కొన్ని కోట్ల మంది ప్రేక్షకుల అభినందనలు.. విమర్శకుల ప్రశంసలు.. అత్యధిక వసూళ్లు ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. బాహుబలి 1 సినిమా క్రియేట్ చేసిన సంచలనం మాటల్లో చెప్పలేం. ఈ సినిమాకి ఎనిమిది ఏళ్లు నిండాయి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ నటనతో పాటు రాజమౌళి టేకింగ్, కీరవాణి సంగీతం, సెంథిల్ కెమెరా వర్క్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాయి.
ఇక బాహుబలి 1 లో విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ సీన్ వస్తుంది. అయితే రాజమౌళి ఇంటర్వెల్కు మరో సీన్ అనుకున్నారట. మహిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకు వచ్చాడు.. బాహుబలి తిరిగి వచ్చాడు అని దేవసేన అన్నప్పుడు శివుడు నడుచుకుంటూ వస్తుంటే.. అతడిలో నుంచి బాహుబలి రూపం వస్తుండగా ఇంటర్వెల్ వేయాలి అనుకున్నారట.
దానికన్నా ముందు శివుడు భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం ఇలా పంచభూతాలు దాటుకుంటూ మహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగుపెడతాడు. శివుడు మహిష్మతి సామ్రాజ్యంలోకి వచ్చే సమయంలో ఒక సైనికుడు శివుడిని చూసి బాహుబలి అనుకుంటాడు. ప్రభు నన్ను ఏమీ చేయవద్దు అని వేడుకుంటాడు.. ఆ సైనికుడు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి బిజ్జల దేవుడికి విషయం చెబుతాడు.
అయితే బిజ్జల దేవుడు అది నమ్మడు. బాహుబలి చచ్చిపోయాడు అని చెబుతాడు. బిజ్జల దేవుడు ఆ డైలాగ్ చెప్పిన వెంటనే శివుడు మట్టి గోడను బద్దలు కొట్టుకుంటూ రావాలి.. వాడి శరీరాన్ని మంటల్లో కలిపేసాం అనగానే అగ్నికీలలు దాటుకుంటూ రావాలి. ఇలా బిజ్జల దేవుడు చెప్పే ఒక్కో డైలాగ్ కు ఒక్కో దశను దాటుకుంటూ వచ్చేలా ఇంటర్వెల్ ప్లాన్ చేసుకున్నాడట రాజమౌళి.
అయితే విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ వేస్తే బాగుంటుందని భావించి బిజ్జల దేవుడు డైలాగులు అన్ని కట్ చేసి పడేసారట. ఈ విషయాన్ని రాజమౌళి ఓ సందర్భంలో స్వయంగా చెప్పారు. ఒక వేళ రాజమౌళి అనుకున్నట్టుగా ముందు ప్లాన్ ప్రకారం ఇంటర్వెల్ సెట్ చేసి ఉంటే బాహుబలి 1 రేంజ్ ఖచ్చితంగా మరోలా ఉండదనే చెప్పాలి.