పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం కావలి నియోజకవర్గం కొత్తపల్లె వద్ద లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. ఇప్పటి వరకు కేవలం 1500 కిలోమీటర్లకు చేరుకోవాల్సి ఉంది. అయితే.. అనూహ్యంగా 500 కిలో మీటర్ల దూరాన్ని షెడ్యూల్ కంటే ముందుగానే నారా లోకేష్ పూర్తి చేయడం విశేషం.
దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయనే వాదన పార్టీలో వినిపిస్తోంది. ఒకటి.. షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. సీఎం జగన్ ఈ ఎన్నికలను ముందస్తుగానే నిర్వహించే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో నారా లోకేష్ కూడా వ్యూహం మార్చుకుని.. ముందు గానే పాదయాత్రను పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకున్నారని మెజారిటీ నాయకులు చెబుతున్నారు.
ఒకవేళ ఎన్నికలు ముందస్తుకు వచ్చే అవకాశం ఉంటే.. ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారి.. పాదయాత్ర మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉంటుందని అంచనా వేసుకున్నారు. ఇక, మరో కీలక విషయం.. పాదయాత్రలో ప్రజల సహకారం. అదేవిధంగా నాయకులు కూడా సహకరిస్తున్నతీరుతో వడివడిగా ముందుకు సాగుతోంది. వాస్తవానికి పాదయాత్ర సాగుతున్న క్రమంలో సభలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. జిల్లాకు రెండు సభలను మాత్రమే షెడ్యూల్లో ప్రకటించారు.
కానీ, పాదయాత్రకు వస్తున్న స్పందన చూసిన తర్వాత.. ప్రతి మండలంలోనూ సభను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇది కొనసాగుతోంది. అదే సమయంలో కొన్ని మండలాల్లో సామాజిక వర్గాల వారీగా కూడా తర్వాత.. సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇది కూడా ముందుగా షెడ్యూల్లో నిర్ణయించకుండానే.. సాగుతుండడం గమనార్హం. మొత్తానికి నారా లోకేష్ చాలా వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు యువగళం పాదయాత్రను మరో రేంజ్కు తీసుకు వెళ్తున్నాయనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.