ప‌వ‌న్ హీరోయిన్ మీరాజాస్మిన్ ఆ కార‌ణంతోనే ఇండ‌స్ట్రీకి దూర‌మైందా…!

రన్ సినిమాతో టాలీవుడ్ కి అడుగుపెట్టిన మీరా జాస్మిన్. శివాజీ హీరోగా వ‌చ్చిన‌ అమ్మాయి బాగుంది సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో గుడుంబా శంక‌ర్ సినిమా చేసింది. ఈ సినిమా స‌రిగా ఆడ‌క‌పోయినా మీరాకు మాత్రం న‌ట‌న‌, చిలిపిక‌ళ్ల‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఆమె నటించిన మొదటి సినిమాలో డ్యూయల్ రోల్ ప్లే చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అందం, అభినయంతో అమాయ‌క‌పు చూపుల‌తో ఎంతమంది అభిమానులను సొంతం చేసుకుంది. రవితేజతో కలిసి నటించిన భద్ర సినిమా సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. మీరా జాస్మిన్ తెలుగులోనే కాక మలయాళ, కన్నడ భాషల్లో కూడా హీరోయిన్‌గా నటించింది.

గుడుంబా శంకర్లో నటించిన మీరా.. రారాజు, ఆకాశరామన్న, బంగారు బాబు, గోరింటాకు, మహాసారథి లాంటి ఎన్నో తెలుగు సినిమాలలో నటించింది. త‌ర్వాత మీరా జాస్మిన్ దుబాయ్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనిల్ జాన్ టైట‌స్‌ని 2014 లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన మీరాజాస్మిన్ తరువాత ఇండస్ట్రీకి దూరమైంది. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మీరా తాను ఇండస్ట్రీకి ఎందుకు ? దూరమ‌య్యానో చెప్పింది.

ఇటీవల విమానం సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మీరాజాస్మిన్ తాను ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణం నటనలో మరింత బెట‌ర్‌గా కనిపించాలని ఉద్దేశమే అని.. తాను మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం నాకు మళ్లీ కొత్త‌గా సినిమాలు ప్రారంభించినట్లు ఉంద‌ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం డైరెక్టర్ శశికాంత్ దర్శకత్వంలో మీరా జాస్మిన్ టెస్ట్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో నయనతార, మాధవన్, సిద్ధార్థ మెయిన్ లీడ్స్‌లో నటిస్తున్నారు.