టాలీవుడ్లో స్టార్ స్టోరీ రైటర్గా వక్కంతం వంశీకి ఒకప్పుడు మంచి పేరే ఉంది. అయితే దానిని అలా కంటిన్యూ చేసుకోలేకపోయాడు. మధ్యలో డైరెక్టర్ అవ్వాలన్న కోరికతో మెగాఫోన్ పట్టి చేతులు కాల్చుకున్నాడు. అప్పటి నుంచి ఎటూ కాన్సంట్రేషన్ చేయలేక రేసులో వెనకపడిపోయాడు. నాగార్జున హీరోగా తెరకెక్కిన వజ్రం సినిమాను అటు ఇటు మార్చినట్లుండే సబ్జెక్ట్ తో ‘నా పేరు సూర్య’ సినిమా తీశాడు.
పైగా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోను పెట్టి మరీ ఈ సినిమా తీశాడు. తన తొలి సినిమాతోనే దారుణమైన, భయంకరమైన పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచీ అజ్ఙాతవాసం అన్నట్టుగా ఉన్నాడు. ఎట్టకేలకు నితిన్ తో సినిమా సెట్ చేసుకున్నాడు. కథ, దర్శకత్వం రెండూ తానే. ఇది సెట్ అయి రెండేళ్లు అవుతోంది. ఇక షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా అంటే చాలా నెలలు అవుతోంది.
అయితే అవుట్ ఫుట్ చూశాక నితిన్కు పిచ్చెక్కినట్లయ్యిందన్న గుసగుసలు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. చాలా నాసిరకమైన అవుట్ఫుట్ వచ్చిందని… ఇక్కడే సరిగ్గా హీరో నితిన్, దర్శకుడు వక్కంతం వంశీకి ఎక్కడో సెట్ కాలేదని అంటున్నారు. ఇక దర్శకుడు వంశీ కూడా ఇదే కథ మీద ఎప్పటి నుంచో కసరత్తులు చేస్తున్నా.. తన బలం సరిపోక ఓ టీంను కూడా పెట్టుకున్నాడట.
వాళ్ల ఐడియాలు తీసుకుని కొంత నడిపించినా కథ అటూ ఇటూ కాకుండా పోయిందంటున్నారు. ఆ తర్వాత నితిన్ ఆఫీస్ లోనే కథ మీద కసరత్తు ప్రారంభించారట. అయితే కథ, టేకింగ్ రెండిటి మీద నితిన్కు అయితే నమ్మకాల్లేవ్ అంటున్నారు. దీంతో నితిన్ కూడా ఈ సినిమా మీద గురి లేక అటు వెంకీ కుడుముల సినిమా మీద కాన్సంట్రేషన్ చేసుకుంటున్నాడట.
ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో దర్శకుడు వంశీ మొత్తానికి మరో చెత్త సినిమా తీశాడని… దీనిని మడిచి పెట్టుకోవడమేనా ? అన్న విమర్శలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా హిట్ అయితే సెన్షేషనలే అవుతుంది.