‘ ప్రాజెక్ట్ కే ‘ … ఖ‌చ్చితంగా బాహ‌బ‌లి అమ్మ మొగుడే… అమ్మ తోడు అట‌..!

టాలీవుడ్ యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ ప్రాజెక్ట్ కె తెర‌కెక్కుతోంది. అయితే ఈ సినిమా గురించి రోజు రోజుకు కూడా ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్లు వ‌స్తున్నాయి. ఇక ఈ సినిమా రెండు పార్టులుగా వస్తుందని.. కాదు కాదు.. ఫ్రాంచైజీ గా వుంటుంద‌ని… ఇలా ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఎట్ట‌కేల‌కు తెలిసిన స‌మాచారం ప్ర‌కారం ప్రాజెక్ట్ కేను కాదు ఫ్రాంచైజీ కాదు రెండు భాగాలుగానే చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు.

అస‌లు ఈ సినిమా మొద‌లు పెట్ట‌క ముందు అనుకున్న బ‌డ్జెట్ వేరు.. ఇప్పుడు రిలీజ్ అయ్యాక తేలుతోన్న లెక్క‌లు వేరు. బ‌డ్జెట్ విప‌రీతంగా పెరిగిపోతుండ‌డంతో ప్లాన్‌లు మార్చుకోక త‌ప్ప‌డం లేదంటున్నారు. ఇందుకోస‌మే పాన్ ఇండియా లెవ‌ల్లో మ‌రింత క్రేజ్ వ‌చ్చేందుకు అన్ని భాష‌ల న‌టుల‌ను యాడ్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.

ఇక రెండు పార్టుల‌లో పార్ట్ 1లో కేవ‌లం పాత్ర‌ల ప‌రిచయంతో అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌డం ఉంటుంద‌ని చెపుతున్నారు. ఇక రెండో పార్టులో సినిమాకు లీడ్‌గా పార్ట్ 1 ఎండింగ్ ఉంటుంద‌ని స‌మాచారం. ఇక లోక‌నాయ‌కుడు కమల్ హాసన్ సినిమా చివరి అరగంటలో ఎంట్రీ ఇస్తాడ‌ని… క‌మ‌ల్ ఎంట్రీతో రెండో పార్ట్ అంతా క‌మ‌ల్ మీదే ఉంటుంద‌న్న ఫీలింగ్‌తో సినిమాను ముగించేలా చేస్తార‌ని టాక్ ?

ఇక ముందుగా ఈ సినిమాకు రు. 500 కోట్ల బ‌డ్జెట్ అవుతుంద‌నుకున్నారు. అయితే ఇప్పుడు అది కాస్తా ఏకంగా రు.800 కోట్లు అయ్యింద‌ట‌. అందువ‌ల్ల రెండు పార్టులుగా సినిమాను రిలీజ్ చేస్తే త‌ప్పా గిట్టేలా లేద‌ని డిసైడ్ అయ్యార‌ట‌. అందుకే ప్రాజెక్ట్ కే కూడా ఇప్పుడు రెండు పార్టులుగా రాబోతోంద‌ని తెలుస్తోంది. ఇక హాలీవుడ్ స్టూడియెల‌ను కూడా ఈ సినిమాలో నిర్మాణ భాగ‌స్వాముల‌ను చేస్తున్నారు.