యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా భారీ అంచనాల మధ్య గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా నిరాశ పరిచింది. ఇక ఇప్పుడు ప్రభాస్తో పాటు ఇండియన్ సినీ జనాల ఆశలు అన్నీ కూడా ప్రభాస్ సలార్ సినిమా మీదే ఉన్నాయి. కేజీయఫ్ సీరిస్ సినిమాలతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా స్పెషల్ ఎట్రాక్షన్ అయిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
ఇక సలార్ సినిమా నిర్మిస్తోన్న హంబలే ఫిల్మ్స్ సంస్థకు ఓ రికార్డు వుంది. ఎంత పెద్ద సినిమా అయినా ఓన్ రిలీజ్ చేసుకుంటారు. ఇక కేజిఎఫ్ 2 విడుదలకు కొద్ది రోజులు ముందు తీసుకున్న అడ్వాన్స్ లు వెనక్కు ఇచ్చేసి నామినల్ కమీషన్ మీద ఓన్ రిలీజ్కు వెళ్లి కళ్లుచెదిరే లాభాలు సొంతం చేసుకున్నారు. ఇలా చేయడం పెద్ద రిస్క్.
తర్వాత అదే హోంబలే సంస్థ కాంతారా సినిమా విషయంలో కూడా అదే పని చేశారు. అది చిన్న బడ్జెట్ సినిమా. ఇప్పుడు సలార్ విషయంలో మాత్రం హోంబలే సంస్థ రివర్స్లో ఆలోచిస్తోంది. తెలుగునాట సలార్ రైట్స్ అమ్మే ప్రక్రియ స్టార్ట్ చేసేసింది. అంటే ఓన్ రిలీజ్ లేదు. ఇక ఏరియాల వారీగా చూస్తే
ఆంధ్ర ఏరియాకు 70 నుంచి 80 కోట్ల రేషియో నడుస్తోంది. నైజాంలోనూ రు. 80 కోట్లు అంటున్నారు.
ఇక్కడే కేజీయఫ్ 2 రు. 70 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు సలార్ను నైజాంలో రు. 70-75 కోట్లకు మించి కొనేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు. 50 కోట్ల మేరకు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ కు మొగ్గు చూపుతున్నట్టు టాక్ ? దీనిపై చర్చలు నడుస్తున్నాయి. ఆంధ్రాలో ఉత్తరాంధ్రకే రు.16 కోట్లు అంటున్నారు. ఏదేమైనా సలార్కు అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తే తప్పా ఈ రేంజ్లో రికవరీలు ఉండవు. సినిమాకు కేజీయఫ్ 2 లాంటి టాక్ వస్తేనే అందరూ సేఫ్.. లేకపోతే ఆదిపురుష్ పరిస్థితే.