అట్ట‌ర్‌ప్లాప్ అవుతుంద‌ని తెలిసి కూడా అల్లు అర్జున్ చేసిన సినిమా ఇదే..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస‌ సినిమాలకు కమిట్ అవుతు ఫుల్ బిజీగా కొనసాగుతున్నాడు.. తాను చేసే ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా పారితోషకం అందుకుంటూ పాన్ ఇండియా రేంజ్‌లో టాప్ హీరోగా మారిపోయాడు అల్లు అర్జున్. ఇక బన్నీ ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. వాటిలో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మరికొన్ని సినిమాలు ప్లాప్‌ అయ్యాయి.

ఇదే సమయంలో చిత్ర పరిశ్రమలో ఉండే ఏ హీరో అయినా దర్శకుడు చెప్పిన కథను నమ్మీ సినిమా చేసేటప్పుడే ఆ సినిమా హిట్ అవుతుందా ? ప్లాఫ్ అవుతుందా ? అనేది వారికి తెలిస్తే ఎవరూ ఆ సినిమా చేయరు. కానీ అల్లు అర్జున్ తన కెరీర్‌లో పెద్ద సాహసమే చేశాడు. ఇక తను హీరోగా వచ్చిన ఓ సినిమా ప్లాప్ అవుతుందని ముందుగానే తెలిసినా కూడా బన్నీ ఆ సినిమాని ఎంతో ఇష్టంగా చేశాడు. అలా చేసిన సినిమానే ”నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ” .

ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ తొలిసారిగా డైరెక్టర్ గా మారి చేసిన సినిమాా ఇది. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే పరమ చెత్త టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, అల్లు అర్జున్ కు జంటగా నటించగా. యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్, నదియా కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా థీమ్ మొత్తం దేశభక్తిపై ఉంటుంది.

బన్నీ కూడా ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌గా దేశమంటే ప్రాణమిచ్చే క్యారెక్టర్ లో నటించాడు. ఈ క్రమంలోని ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అల్లు అర్జున్ ఈ మూవీ ప్లాప్ అవుతుందని భావించాడట.
దానికి ముఖ్య కారణం ప్రస్తుత కాలంలో ఉన్న యూత్ రొమాంటిక్, సస్పెన్స్, హారర్ సినిమాలు మాత్రమే చూస్తున్నారు. ఇలాంటి దేశభక్తి సినిమాలు అంటే ఎవరికి నచ్చడం లేదు.

బన్నీ కూడా ముందుగానే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని గెస్ చేశారట. కానీ తన కెరీర్ లో ఒకటైన ఇలాంటి దేశం గురించి ఒక సినిమా చేశాను అన్న తృప్తి మాత్రం తనకు ఉండాలనే ఒక కారణంతోనే ఆ సినిమాలో బన్నీ నటించాడట. చివరగా సినిమా విడుదలయ్యాక అల్లు అర్జున్ అనుకున్నదే జరిగింది.. సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.