టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నా హీరోలను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ మహేష్ సొంతం. ఇప్పటివరకు మహేష్ పాన్ ఇండియా సినిమా చేయలేదు. కానీ అదే స్థాయిలో మహేష్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఇక ఒక్క సినిమా చేయకుండానే మహేష్ కూతురు గ్లోబల్ వైడ్ గా భారీ క్రేజ్ దక్కించుకుంది.
రీసెంట్ గానే మహేష్ కూతురు సితార ఓ జ్యూవెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా మారి ఓ యాడ్ లో కూడా నటించింది. మహేష్ గారాల కూతురు సితార పీఎంజే జ్యూవెల్లరీకి ప్రమోటర్గా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఈ యాడ్కు సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియాలో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి.
సితార ఈ యాడ్ కోసం ఎంత మేర పారితోషకం తీసుకుందా..? అన్నది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ హాట్ టాపిక్ అయ్యింది. అయితే మహేష్ సితారను ఆ యాడ్ కోసం ఒక్క రూపాయని కూడా తీసుకొనివ్వలేదట. సదరు జ్యువెలరీ సంస్థ వారు మాత్రం సితార కోసం కోటి రూపాయలు విలువచేసే ఓ డైమండ్ హారాన్ని, రింగు గిఫ్ట్ గాా ఇచ్చిందట.
దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాకుండా సితార నటించిన తొలి యాడ్ తోనే న్యూయార్క్ టైం స్క్వేర్ పై కనిపించింది. దీన్ని మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక దీంతో చిన్న వయసులోనే తండ్రిని మించిన కూతురుగా మారిపోయింది.