సినిమా ఇండస్ట్రీలో గేయ రచయిత అనంత శ్రీరామ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అతి చిన్న వయసులోనే ఎన్నో అవార్డులు అందుకొని సినిమా ఇండస్ట్రీలో తనకంటూ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టుకున్నారు. చిన్న వయసులోనే ప్రతిభ చాటుకున్న గేయ రచయితలు అరుదుగా కనిపిస్తూ ఉంటారు ..వాళ్లల్లో ఒక్కరే ఈ అనంత శ్రీరామా్ అని ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు చెప్పిన విషయం తెలిసిందే . కాగా ఎప్పుడూ పాజిటివ్ కామెంట్స్ తో ప్రశంసలతో పొగిడేసే అనంత శ్రీరామ్ ని ఈసారి జనాలు బాగా టార్గెట్ చేశారు . ట్రోల్ చేస్తున్నారు. బూతులు వర్షం కురిపిస్తున్నారు. ఫ్యామిలీ విషయాలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో అనంత శ్రీరామ్ పేరు మారుమ్రోగిపోతుంది.
దీనంతటికీ కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ట్రోలింగ్ చేసిన ఓ పొలిటికల్ మిస్సైల్ పేజీకి శ్రీరామ్ హెడ్ గా ఉన్నారు అని వార్తలు వినిపించడమే అంటూ తెలుస్తుంది.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఓ చిన్నారి స్టెతస్కోప్ తో పరీక్షిస్తున్న ఫోటో ఇప్పుడు నెట్టింట హట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆ ఫోటోపై కామెంట్స్ మొత్తం వివాదానికి కారణమయ్యాయి . స్కానింగ్ తీయకుండానే జస్ట్ అలా చూసి గుండెలో రంద్రం ఉందని చెప్పేయడం పై వ్యంగ అస్త్రాలు వేస్తున్నారు పలువురు జనాలు . ఈ క్రమంలోనే ఫేక్ డాక్టర్ అంటూ ఆ ఫోటోతో పోస్టింగులు వైరల్ చేస్తున్నారు .
అయితే ఈ పోస్టులో పొలిటికల్ మిస్సైల్ అనే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ అయ్యాయి. దీంతో ఈ పేజీను నిర్వహిస్తున్నది అనంత శ్రీరామ్ అనేది వాళ్ళ వాదన. దీంతో వైసిపి అభిమానులు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు . గతంలో చంద్రబాబు నాయుడుతో దిగిన ఫొటోస్ ట్రోల్ చేస్తున్నారు . టిడిపి సానుభూతిపరుడు అంటూ పచ్చి బూతు పదాలతో ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ఆయన జనసేన ఫ్యాన్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు.
ఈ క్రమంలోనే శ్రీరామ్ వీడియోతో క్లారిటీ ఇచ్చాడు . “నాపై వస్తున్న వార్తల్లో ఏది నిజం లేదు.. నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారో నాకు తెలియదు. నాటా మహాసభ నిమిత్తం అమెరికాలో ఉన్నాను ..నేను ఇండియాకి రాగానే వాళ్లపై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తాను ..దయచేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నమ్మకండి” అంటూ చెప్పుకొచ్చారు.