తమిళ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ్తో కలిసి మల్టీస్టారర్గా చేస్తోన్న సినిమా బ్రో. ఈ సినిమా ఈనెల 28న రిలీజ్ అవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ లో రిలీజై హిట్ అయినా వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా రాబోతుంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా… సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయి మళ్ళీ బతికిన భక్తుడిగా కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సాయి ధరంతేజ్ నుంచి విరూపాక్ష లాంటి హిట్ సినిమా తర్వాత రిలీజ్ కాబోతున్న సినిమా కావడం.. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇందులో నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కంప్లీట్ అయిపోయిందట. ఇప్పటివరకు జరిగిన బిజినెస్ కౌంట్ చూస్తే ఆంధ్రాలో రూ.40 కోట్లకు హక్కులను ముగ్గురు డిస్ట్రిబ్యూటర్స్ కలిసి కొన్నారట. నైజాంలో రూ.30 కోట్లకు డీల్ సెట్ కాగా.. సీడెడ్లో రూ.13 కోట్లకు రైట్స్ అమ్మారట. ఓవర్సీస్ లో రూ.13 కోట్లకి డీల్ క్లోజ్ చేసుకుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరో ఇద్దరితో కలిసి రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉంది.
ఇక కర్ణాటక, రెప్ట్ ఆఫ్ ఇండియా డీల్స్ పై ఇంకా చర్చలు జరుగుతున్నాయట. మొత్తానికి తెలుగు వరకే రూ.100 కోట్ల వరకు బ్రో మూవీ బిజినెస్ జరిగిందట. అంటే పవన్ – సాయి తేజ్ ఎదుట ప్రస్తుతం పెద్ద టార్గెట్ ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్, వకీల్ సాబ్ కి వచ్చిన అడ్డంకులు ఏవి ఈ సినిమాకు రాకపోతే ఈ సినిమా భారీ కలెక్షన్స్ అందుకునే అవకాశాలు ఉన్నాయి.