చిరంజీవి చేసిన పనికి క‌ళ్యాణ్‌రామ్‌కు ప‌ట్ట‌రాని కోపం… వీరిద్ద‌రికి గొడ‌వ ఎందుకు…!

గతేడాది టాలీవుడ్‌ క్రైసిస్ ని ఫేస్ చేసింది. ప్రేక్ష‌కులు థియేటర్స్ కి రావట్లేదు, సినిమాల్లోనేమో కంటెంట్ ఉండట్లేదు.. ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్స్ తగ్గించేసింది.. అటు ఓటీటీ హవా పెరుగుతోంది ఇలా రకరకాల కారణాలు తెలుగు సినిమాని కొన్ని నెలల పాటు ఉక్కిరి బిక్కిరి చేసి పడేశాయి. దీంతో చేసేదేమి లేక నష్ట నివారణ చర్యలు చేపడుతూ షూటింగ్లు కూడా ఆపేసే స్థాయికి ప్రొడ్యూసర్లు వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో సరైన సినిమా రిలీజ్ అయితే ప్రేక్ష‌కులు థియేటర్ల‌కు వస్తారు.. ఆ సినిమాల‌కు మంచి లాభ‌లు వస్తాయి అని నిరూపించిన సినిమా ‘బింబిసార’.

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ డబుల్ బ్లాక్ బస్టర్ కష్టాల్లో ఉన్న టాలీవుడ్‌కి ఊపిరి పోసింది. బింబిసారతో పాటు రిలీజ్ అయిన సీతారామం సినిమా కూడా డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ మాస్ లో బింబిసార సినిమాకి మరింత రీచ్ దక్కింది. ఫాంటసీ డ్రామాగా, రూ.40 కోట్ల బడ్జెట్‌తో కొత్త దర్శకుడు మ‌ల్లిడి వశిష్ట డైరెక్ట్ చేసిన బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

ఫస్ట్ సినిమానే అయినా గ్రాఫిక్స్ పరంగా.. బింబిసారను చాలా బాగా హ్యాండిల్ చేశాడు వశిష్ట. బింబిసార రిలీజ్ సమయంలోనే ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుంది, ఒక ఫ్రాంచైజ్ లా ఈ సినిమాలు వస్తూ ఉంటాయి అని కళ్యాణ్ రామ్ కన్‌ఫామ్ చేశాడు. బింబిసార 2లో లేదా 3లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తాడని కళ్యాణ్ రామ్ చెప్పాడు. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ తన సినిమాలతో బిజీ అయిపోయాడు కానీ బింబిసార 2 గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. లేటెస్ట్ గా బింబిసార 2 సినిమా గురించి ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అసలు విషయం ఏమిటంటే దర్శకుడు వశిష్ట మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా కమిట్ అయ్యాడని తెలుస్తుంది. బింబిసార‌2ను పక్కన పెట్టి మెగాస్టార్ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక దీంతో కళ్యాణ్‌రామ్‌ దర్శకుడు వశిష్టపై ఎంతో ఆగ్రహంగా ఉన్నాడట. తనతో సినిమా పూర్తవ్వ‌కుండా చిరంజీవితో సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. బింబిసార‌ సినిమాకి నేను ఇచ్చిన ఐడియాల వల్లే ఆ సినిమా మంచి విజయం సాధించింద‌ని… వ‌శిష్ట్ లేక‌పోయినా బింబిసార2 సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుందని కళ్యాణ్ రామ్ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లుగా సమాచారం. వశిష్ట కథకి మాత్రమే పరిమితం అయ్యి దర్శకత్వ బాధ్యతలు మాత్రం మ‌రో ద‌ర్శ‌కుడు అనిల్ పాదూరికి అప్పగించినున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో వారికే తెలియ‌లి.