మెగా డాటర్ నిహారిక – జొన్నలగడ్డ చైతన్య 2020లో రాజస్థాన్లో ఉదయపూర్ కోటలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కొన్ని రోజులు సవ్యంగా సాగిన వీరి కాపురం తర్వాత నిహారిక సోషల్ మీడియా అకౌంట్లో చైతన్య ఫొటోస్ డిలీట్ చేయడం.. చైతన్య నిహారిక ఫొటోస్ డిలీట్ చేయడంతో వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అన్న సందేహం జనాల్లో మొదలైంది.
గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని.. విడాకులకు అప్లై చేశారని.. వీరు ఇద్దరు ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారని అనేక రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ విడాకులపై అన్ని వార్తలు వస్తున్నా ఎప్పుడు స్పందించలేదు. కాగా ఇటీవల నిహారిక కొన్ని బోల్డ్ వెబ్ సిరీస్లో కూడా నటించడం మునుపెన్నడూ లేని విధంగా హాట్ ఫోటో షూట్లను నిర్వహించడంతో విడాకుల వార్తలపై అనుమానాలు మరింతగా బలపడ్డాయి.
తాజాగా వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసిన విడాకుల దరఖాస్తు పత్రం సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఈ వార్త నిజమేనని తేలిపోయింది. నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు కోరుతూ కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేశారు. కాగా నిహారిక కొణిదెల విడాకుల పిటిషన్ కోసం ఆమె తరుపున ఎంచుకున్న న్యాయవాది ఎవరో కాదు మెగా ఫ్యామిలీ వీరాభిమాని సుంకర దిలీప్.
దిలీప్ ప్రముఖ సోషల్ మీడియా వ్యక్తి, జనసేన తరపున సోషల్ మీడియాలో బలంగా తన వాయిస్ వినిపిస్తూ ఉంటారు. దీంతో చాలా మంది నెటిజన్లు ఇప్పుడు దిలీప్ను అసలు వీరి విడాకులకు కారణం ఏంటి ? ఏం జరిగింది ? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.