టాలీవుడ్లో అఖండ సినిమా రిలీజ్కు ముందు బాలయ్యకు ఉన్న క్రేజ్ వేరు. అఖండ సినిమా తర్వాత బాలయ్యకు ఉన్న క్రేజ్ వేరు. ఈ విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. అఖండ తర్వాత బాలయ్య క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వెండితెర నుంచి బుల్లితెర వరకు బాలయ్య పట్టిందల్లా బంగారం అవుతోంది.
ఆ మాటకు వస్తే అమెరికా నుంచి అనకాపల్లి వరకు ఎక్కడ చూసినా కూడా జై బాలయ్య నినాదం మార్మోగుతోంది.
అసలు ఇతర హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా థియేటర్లలో జై బాలయ్య అంటూ నినాదాలు మార్మోగుతున్నాయి. బయట ఫంక్షన్లు, జాతరలు లేదా పెళ్లిళ్లలో కూడా ఈ నినాదం ఇప్పుడు మామూలు అయిపోయింది. చివరకు మామూలు హీరోల అభిమానుల పెళ్లి లేదా వాళ్ల ఇంట్లో మరో ఫంక్షన్ జరుగుతున్నా కూడా జై బాలయ్య అంటూ నినిదాలను హోరెత్తిస్తున్నారు.
ఇప్పుడు ఇదో పిచ్చ అభిమానం అయిపోయింది. ఇక అమెరికాలో కూడా ఏ ఫంక్షన్ జరిగినా, మరో హీరో సినిమా రిలీజ్ అయినా కూడా థియేటర్లలో పేర్లు పడే ముందో లేదా సినిమా సగం అయ్యాక కాని జై బాలయ్య అంటూ నినాదాలు మొదలైపోతాయి. తాజాగా ఈ నినాదం పార్టీలు, కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో మార్మోగుతోంది.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగోడు ఎక్కడ ఉన్నా జై బాలయ్య అన్నది కామన్ క్యాప్షన్ అయిపోయింది. అంటే బాలయ్య అంతలా వారి మనస్సుల్లోకి చొచ్చుకుపోయాడు. ఈ తరం జనరేషన్ కు కూడా బాలయ్య అన్స్టాపబుల్ పుణ్యమా అని కనెక్ట్ అయిపోయాడు. దీనిని బట్టి ఇప్పుడు జై బాలయ్య ఎంత పవర్ ఫుల్ అయ్యిందో చూడొచ్చు.