హీరోగా ర‌వితేజ‌.. విల‌న్‌గా మంచు మ‌నోజ్‌.. కిల్ల‌ర్‌గా విశ్వ‌క్‌సేన్‌… డైరెక్ట‌ర్ ఎవ‌రంటే…!

టాలీవుడ్‌లో ఇటీవ‌ల కాలంలో సీనియ‌ర్ హీరోలు మాత్ర‌మే కాదు.. జూనియ‌ర్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు కూడా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసేందుకు.. త‌మ తోటి హీరోల‌తో క‌లిసి స్క్రీన్ పంచుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. అస‌లు త్రిబుల్ ఆర్ సినిమా లాంటి చ‌ర‌న్ – ఎన్టీఆర్ క‌లిసిన మ‌ల్టీస్టార‌ర్ వ‌చ్చాక చాలా మంది హీరోలు క‌లిసి న‌టించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.

టాలీవుడ్‌లో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఓ కొత్త కాంబినేషన్ సెట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంత‌కు ఆ హీరోలు ఎవ‌రో కాదు మాస్ మ‌హ‌రాజ్ రవితేజ-విష్వక్ సేన్-మంచు మనోజ్ లు ఒకే సినిమాలో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమాకు ఓ యంగ్ డైరెక్ట‌ర్ ప్లాన్ చేస్తున్నాడు. కలర్ ఫొటో సినిమా తీసిన దర్శకుడు సందీప్ రాజ్ తయారు చేసుకున్న ఈ కథ లో హీరోగా రవితేజను ఓకే చేశార‌ట‌.

ఈ కథలో హీరోగా ర‌వితేజ‌, విలన్ గా మంచు మనోజ్ నటిస్తారు. అయితే మ‌రో కిల్ల‌ర్ పాత్ర‌లో మ‌రో యంగ్ హీరో విష్వక్ సేన్ న‌టిస్తాడ‌ని.. విశ్వ‌క్ సేన్ రోల్లో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంద‌ని చెపుతున్నారు. ఈ ముగ్గురు హీరోల కాంబినేష‌న్ అంటే ఖ‌చ్చితంగా క్రేజీ కాంబినేష‌నే అని చెప్పాలి. ఈ సినిమాను ఎవరు ? నిర్మిస్తారు.. ఏయే బ్యానర్లు కలుస్తాయి అన్న విష‌యాల‌పై క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ఈ సినిమాను ఏ బ్యానర్ నిర్మిస్తుంది అన్నది రవితేజ డిసైడ్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ న‌టిస్తోన్న‌ గోపీచంద్ మలినేని – మైత్రీ సినిమా… ఆ తరువాత సితార బ్యానర్ సినిమా ఉంటాయి. ఈ రెండు సినిమాల త‌ర్వాతే ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌మీద‌కు వెళ్ల‌వ‌చ్చు.