పూనమ్ కౌర్.. 2006లో మాయాజాలం సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత శౌర్య, వినాయకుడు, ఈనాడు సినిమాల్లో నటించిన పూనమ్ తర్వాత చాలా కాలం వెండితెరకు దూరంగా ఉంది. ఇటీవల 2022లో నాతిచరామి మూవీలో నటించింది. ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. అయితే పూనమ్ సాధారణంగా సినిమాల్లో కంటే సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో ఎక్కువగా చిక్కుకుంటూ ఉంటుంది.
సాధారణంగా పూనమ్ చేసే వ్యాఖ్యలన్నీ ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ లేదా త్రివిక్రమ్ని ఉద్దేశించి ఉంటాయి. ఈ కారణంగా గతంలో అనేక వివాదాల్లో చిక్కుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేతిలో ట్రోల్స్ కి గురైంది పూనమ్. అప్పుడప్పుడు ఇండైరెక్ట్గా వీరిపై కామెంట్స్ చేస్తూ ఉంటూ సడెన్గా వార్తల్లోకి వచ్చి మాయమైపోతూ ఉంటుంది.
తాజాగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది పూనమ్. గురు పౌర్ణమి సందర్భంగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి గురువు అని సంబోధిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాడు. గురు లక్ష్యం నెరవేరాలని.. ఇకపై ఆయన ఫేమ్, నేమ్ నేను ఎప్పటికీ వాడుకోనని.. ఆయన సీఎం కావాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు.
పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ గురు అని పిలచిన నేపథ్యంలో ఫైర్ అయింది పూనమ్. ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రతి అడ్డమైన వాడు గురు ఎలా అవుతాడు ? స్టేజ్ పైన నీతులు చెప్పి జీవితాలతో ఆడుకునే వాడు గురువు కాదు.. దారి చూపించేవాడు గురువు అవుతాడు. దయచేసి అర్హత లేని వారిని గురువు అని పిలవకండి అంటూ కామెంట్స్ చేసింది.
ఈ కామెంట్స్ ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేస్తుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.