ఒక సినిమాకు డైరెక్టర్ అనే వాడు వెన్ను ఎముక లాంటివాడు ..సినిమా తెరపైకి రావాలంటే దాని వెనుక హీరో, హీరోయిన్ల కంటే దర్శకుడు కష్టమే ఎంతో ఎక్కువ ఉంటుంది. మన టాలీవుడ్ లో ఎంతమంది దర్శకులు ఉన్నారు. రోజు ఒక కొత్త దర్శకుడు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. అయితే కెరీర్ మొదటి నుంచి ఇప్పటివరకు ఒక అపజయం ఎరుగని దర్శకుడు ఎవరు..? అన్న ప్రశ్నకు అందరూ దాదాపు చెప్పే పేరు దర్శక ధీరుడు రాజమౌళి.
ఆయన తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ వరకు 13 సినిమాలు తెరకెక్కించారు. వాటిలో ఒక సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలవలేదు. 13 సినిమాలు కూడా ఒక్క సినిమాను మించి మరొక సినిమా ఉంటుంది. అందుకే ఆయన హిస్టరీలో ప్లాఫ్ అనే పదం ఉండదు. రాజమౌళితో పాటు ప్లాఫ్ అంటే తెలియని టాలీవుడ్ దర్శకులు మరికొందరు కూడా ఉన్నారు.
వారిలో ముందుగా అనిల్రావిపూడి ఒకరు. రైటర్ గా కెరీర్ను మొదలుపెట్టి పటాస్ సినిమాతో డైరెక్టర్ గా మారిన అనిల్ తొలి సినిమాతోనే తన సత్తా చూపించాడు.. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకు ఎవరు, ఎఫ్ 3 వంటి సినిమాలను తెరకెక్కించి బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. అలాగే మరో డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఆయన కెరీర్ మొదటి నుంచి ఇప్పటివరకు అపజయం అంటే ఏమిటో తెలియదు.
ఆయన పదేళ్ల కెరీర్లో ఆయన చేసిన సినిమాలు రెండే.. వాటిలో ఎవడే సుబ్రహ్మణ్యం, మరొకటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి. ప్రస్తుతం ఈ క్రేజీ దర్శకుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రాజెక్టుకె అనే ఓ భారీ సినిమా చేస్తున్నాడు. వీరే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా అపజయం ఎరుగని దర్శకులు కూడా ఉన్నారు.. వారు ఎవరంటే కోలీవుడ్ నుంచి లోకేష్ కనకరాజ్, అట్లీ, కన్నడ నుంచి ప్రశాంత్ నీల్, బాలీవుడ్ నుంచి రాజ్ కుమార్ హిరాని వంటి దర్శకులకు కూడా వారి కెరీర్ లో ఫ్లాప్ అంటే ఏమిటో తెలియదు.