టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ నిజంగా పరిపూర్ణ మైన జీవితాన్ని అనుభవించారనే చెప్పాలి. ఇప్పటికే ఎనిమిదిన్నర పదుల వయస్సుకు చేరువ అయిన మురళీమోహన్ ఈ వయస్సులోనూ కుర్రాళ్లకు పోటీ ఇస్తూ అంతే ఉత్సాహంతో ఉంటారు. ఆయన ఓ సాధారణ నటుడు స్థాయి నుంచి ఈ రోజు గొప్ప బిజినెస్మేన్ గా ఎదిగారు. ఇక పార్లమెంటు సభ్యుడిగాను పనిచేశారు. నటుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, ఇటు రాజకీయాల్లోనూ, అటు నిర్మాణ రంగంలోనూ అన్నింటా సక్సెస్లు చూశారు.
ఇక మురళీ మోహన్ సినిమా కెరీర్లో హీరోయిన్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. హీరోయిన్లకు దూరంగా ఉండేవారు. కేవలం సినిమా సెట్స్ వరకే హీరోయిన్లతో ఆయన మాటలు పరిమితం. బయటకు వచ్చాక తన ఫ్యామిలీకే ప్రయార్టీ ఇచ్చేవారు. అయితే ఇద్దరు హీరోయిన్ల విషయంలో మాత్రం ఆయన రూమర్లు ఎదుర్కోక తప్పలేదు.
హీరోయిన్ జయచిత్రతో మురళీమోహన్ కొన్ని సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే ఒక్కోసారి షూటింగ్ పూర్తయ్యాక కూడా ఆయన జయచిత్రతో కలిసి మద్రాస్ బీచ్ల్లో కూర్చొని కబుర్లు చెప్పుకునే వారట. ఇలా రెండు మూడు సార్లు చేయడంతో ఎవరో తమిళ గాసిప్ పత్రికల వాళ్లు ఫొటో తీసేసి వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని.. వార్తలు రాసేశారట.
అప్పట్లో మద్రాస్లో పాపులర్ అయిన కాగడా అనే పత్రిక వీరి గురించి రాసిందని మురళీ మోహన్ స్వయంగా చెప్పారు. ఆ తర్వాత మరో హీరోయిన్ దీపతో కూడా మురళీ మొహన్ ఎక్కువ సినిమాల్లో నటించారు. వారిద్దరి మధ్య కూడా ఆ లింక్ ఉందంటూ పుకార్లు వచ్చాయట. దీప మళయాళ హీరోయిన్. ఆమె తెలుగులో బాలయ్యకు జోడీగా ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన అక్బర్ సలీం అనార్కలీ సినిమాలో కూడా హీరోయిన్గా చేసింది.
దీపను తాను ఎప్పుడూ ఏమండి అని గౌరవంగానే పిలిచే వాడిని అని.. కేవలం ఆమెతో ఎక్కువ సినిమాలు చేస్తున్న క్రమంలోనే మా ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ రకరకాల వార్తలు రాశారని.. అవన్నీ పుకార్లే అంటూ మురళీ మోహన్ కొట్టి పడేశారు.