టాలీవుడ్ టాప్ ఫ్యామిలీలలో నందమూరి కుటుంబం ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని అనడంలో సందేహం లేదు. సీనియర్ ఎన్టీఆర్ కన్నుమూసిన తర్వాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లు నందమూరి నటవారసత్వాన్ని గొప్పగా కొనసాగిస్తూ నందమూరి అభిమానులను అలరిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కూడా మొన్న బింబిసారతో సూపర్ హిట్ అందుకున్నాడు.
ఇక మేకప్ వేసుకున్న నందమూరి కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు ఇతర నందమూరి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. వారిలో బాలయ్య గారాల పట్టీలైన నారా బ్రాహ్మణి, తేజస్వినిలు కూడా ఉన్నారు. హీరోయిన్కి ఏమాత్రం తీసుకొని అందంతో కనిపించే నారా బ్రాహ్మణి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమన్గా రాణిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో తాజాగా బ్రాహ్మణికి సంబంధించి ఒక ఫేక్ ట్వీట్ వైరల్గా మారింది.
ఆ ట్వీట్లో ప్రముఖ సీఎం సతీమణి తన సోదరి లాంటిదని బ్రాహ్మణి పేర్కొన్నట్లు ఉంది. అయితే ఈ ట్వీట్లో అసభ్యకరమైన పదజాలం ఏమీ లేదు. అలాగే బ్రాహ్మణికి కూడా వ్యతిరేకంగా ఎలాంటి పదాలు లేవు. కానీ బ్రాహ్మణి పేరు వాడుకోవడమే ఇక్కడ కాంట్రవర్షల్గా మారింది. ఇంతకీ ఆ ప్రముఖ సీఎం మరెవరో కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతని భార్య భారతిని బ్రాహ్మణి ప్రస్తావించినట్లు ఈ నకిలీ ట్వీట్ విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
అయితే ఆమె గురించి బ్రాహ్మణి మాట్లాడినట్లు కాంట్రవర్సీ సృష్టించాలని ఎవరో కావాలనే ఈ ట్వీట్ చేసినట్లు ఉన్నారని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా బ్రాహ్మణి పేరుతో సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయినట్టు వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
బ్రాహ్మణి పేరును చెడగొట్టాలనే ఉద్దేశంతో కొందరు ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక బ్రాహ్మణి ఎప్పుడు ఏం మాట్లాడాలో పూర్తి అవగాహనతో ఉంటారు. వివాదాస్పద వ్యాఖ్యలకు ఆమె చాలా దూరంగా ఉంటారు.