‘ భగవంత్ కేసరి ‘ కంటే ముందే బాలయ్య – కాజల్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ ఇదే..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అందాల భామ కాజాల్‌ అగర్వాల్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు టాలీవుడ్ సెన్సేషన్ శ్రీ లీల కూడా బాలయ్యకు కూతురుగా ఈ సినిమాలో నటిస్తుంది.

ఇదే సమయంలో బాలయ్య, కాజల్ కాంబోలో వస్తున్న తొలి సినిమా కూడా ఇదే. కానీ చాలామందికి తెలియని అసలు విషయం ఏమిటంటే.. భగవంత్‌ కేసరి సినిమా కంటే ముందే బాలయ్య- కాజల్ కాంబోలో బ్లాక్ బస్టర్ సినిమా మిస్సయింది. ఆ సినిమా మరేదో కాదు అఖండ. మాస్ దర్శ‌కుడు బోయపాటి శ్రీను బాలయ్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ.

ఈ సినిమాలో బాలయ్యకు జంటగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాలయ్య తొలిసారిగా అఘోర పాత్రలో నటించి థియేటర్లో పూనకాలు తెప్పించాడు. 2021 డిసెంబర్ లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది. అంతకుముందు వ‌రుస ప్లాప్‌ల‌తో సతమతమవుతున్న బాలయ్య అఖండ మూవీతో భారీ హీట్ కొట్టి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు.

ఈ సినిమాలో బాలయ్యకు జంటగా ప్రగ్యా కలెక్టర్ పాత్రలో నటించింది. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం కాజల్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌నే సంప్రదించారట. ఆ సమయంలో కాజల్ గర్భవతిగా ఉండడంతో సున్నితంగా అఖండలో హీరోయిన్ రోల్ ను రిజెక్ట్ చేసిందట. దాంతో చివరగా ప్రగ్యాను ఎంపిక చేశారు. అలా బాలయ్య- కాజల్ కాంబోలో ఆఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా మిస్సయింది.