టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో ఎందరినో ఆకట్టుకుంది చేసింది. ఆమె చేసింది తక్కువ సినిమాలు అయినా దాదాపు టాలీవుడ్ లో నాలుగేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా వెలిగింది. అసలు నాలుగేళ్ల పాటు స్టార్ హీరోల నుంచి మిడిల్ రేంజ్ హీరోల వరకు అందరూ రకులే తమకు హీరోయిన్గా కావాలని పట్టుబట్టారు. అలాంటి ఈ రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు టాలీవుడ్లో సినిమా అవకాశాలు రావడం లేదు.
దీంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సౌత్లో అగ్ర హీరోయిన్గా ఉన్న ఈమె బాలీవుడ్ లో కూడా తన అందంతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ టాలీవుడ్ లో తనకు అవకాశాలు తగ్గటానికి ఓ సీనియర్ హీరో కారణమని వాపోయింది.
అందుకు రకుల్ ప్రీత్ సింగ్ తనకు టాలీవుడ్ లో ఎంతో మంచి గుర్తింపు ఉందని అక్కడే తనకు మంచి అవకాశాలు వచ్చాయని.. కెరీర్ మంచి పిక్స్లో ఉన్న సమయంలోనే ఒక సీనియర్ హీరోతో లిప్ లాక్ సన్నివేశంలో నటించాను.. ఆ సినిమా ఆ సన్నివేశాలు ఆడియన్స్ కి అసలు నచ్చలేదని.. ఆ సినిమాలో నా క్యారెక్టర్ ను ప్రేక్షకులు సరిగా రిసీవ్ చేసుకోలేకపోయారని దాంతో ఆ సినిమా ప్లాప్ అయిందంటూ రకుల్ చెప్పుకొచ్చింది.
ఆ సమయం నుంచి తనకు టాలీవుడ్లో అవకాశాలు రాకుండా తగ్గిపోయాయని రకుల్ చెప్పుకొచ్చింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఈ కామెంట్లు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జునను ఉద్దేశించి ఈ కామెంట్లు చేసి ఉండొచ్చంటూ అందరు సోషల్ మీడియాలో రకుల్ కామెంట్లను బట్టి నాగ్ను ట్రోల్ చేస్తున్నారు.
నాగార్జున- రకుల్ కలిసి గతంలో మన్మధుడు2 సినిమాలో నటించరు. అందులో నాగార్జున, రకుల్తో ఘాటైన మూతిముద్దులతో రెచ్చిపోయాడు. ఏదేమైనా రకుల్ పరోక్షంగా నాగార్జున లాంటి ముసలోడితో అలా చేసి తన కెరీర్ నాశనం చేశానని చెప్పి.. నాగ్ను అవమానించి నట్లైందన్న చర్చలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి.