హీరోయిన్ శ్వేతాబసు ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కొత్త బంగారులోకం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది శ్వేతా బసు తను నటించిన మొదటి సినిమాను సూపర్ హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ఆమె వరుణ్ సందేశ్కు జోడీగా నటించింది. కానీ ఆ తర్వాత నటించిన సినిమాలు ఏవి సక్సెస్ సాధించలేదు.
కొంతకాలానికి అసాంఘీక కార్యక్రమాలు చేస్తూ పోలీస్ రైడ్లో పట్టుబడిన శ్వేతా బసు అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తర్వాత టాలీవుడ్ లో ఛాన్సులు తగ్గిపోవడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అక్కాడా సినిమాలు ఆడక.. కాలం కలిసి రాకపోవడంతో చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంది.
ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ మిఠాల్ని శ్వేత వివాహం చేసుకుంది. కానీ వీరిద్దరూ మనస్పర్ధలు కారణంతో పెళ్లయిన ఎనిమిది నెలలకి విడాకులు తీసుకున్నారు. దీనిపై ఇంటర్వ్యూలో స్పందించిన శ్వేతా బసు మేము విడిపోవడానికి ఎటువంటి కారణాలు లేవని.. మనసులు కలవకపోవడం.. అభిప్రాయాలు కలవకపోవడంతోనే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
మెటల్ వ్యక్తిగతంగా చాలా మంచి వాడని.. అలాగే అతడు ఒక అద్భుతమైన డైరెక్టర్ అని… మాజీ భర్త పై ప్రశంసలు వర్షం కురిపించిన శ్వేత అతడు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నా… మా బంధం ఇంత త్వరగా ముగిసిపోతుందని ఎప్పుడూ ఊహించుకోలేదని చెప్పుకొచ్చింది.