ఓకే ఫ్రేమ్‌లో టాలీవుడ్ లెజెండ్స్.. ఈ గొప్ప‌ ఫోటో వెనుక ఇంత స్టోరీ ఉందా..!

చిరంజీవి మెగాస్టార్‌గా వరుస కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీ హిట్స్ అందుకుంటున్న సమయంలో చిరుకు ఓ చిన్న వెలితి ఉండేదట. ఎందుకో ఒకే రకమైన సినిమాలు చేసుకుంటూ వెళ్ళటం ఆయనకు అసలు నచ్చేది కాదట. ఆ సమయంలోనే కొత్తగా మరేదైనా చేయాలనే ఆలోచనతో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ముగ్గురు మొనగాళ్లు సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఇక ఈ సినిమాలో చిరంజీవి మూడు పాత్రలో నటించేందుకు ప్లాన్ చేశారు.

మొదటిసారిగా చిరంజీవి మూడు పాత్రలో కనిపిస్తున్నారు అనగానే.. ముగ్గురు మొనగాళ్లు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవ్వడంతో 1994లో జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచి భారీ కలెక్షన్లను కూడా అందుకుంది. అంతే కాకుండా ఈ సినిమాను చిరంజీవి తన సొంత బ్యానర్ అయిన అంజన ప్రొడక్షన్స్ పై చిరు తమ్ముళ్లు నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్మాతలుగా నిర్మించారు.

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘవేందర్రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరుకు జంటగా హీరోయిన్లుగా నగ్మా, రమ్యకృష్ణ, రోజా వంటి తదితరులు ముఖ్యపాత్రలో నటించారు. చిరు మూడు పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు అన‌గానే ఇండ‌స్ట్రీలో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే పక్కనే మరో షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్, దర్శక నిర్మాత దాసరి నారాయణరావు, మరో నిర్మాత రామానాయుడు, అలాగే యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున అందరూ కలిసి ఒకే ప్లేస్‌లో కలిశారు.

అలా వీరందరూ కలిసి ఒకే ఫ్రేమ్లో ఉన్నరు. ఆ ఫోటోలో ఎన్టీఆర్ మధ్యలో కూర్చుని ఉండగా ఆయన పక్కన చిరంజీవి కూర్చుని ఉంటాడు. అలాగే దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు మరో పక్క కూర్చుని ఉండగా. రామానాయుడు వెనకాల నాగార్జున ఉంటాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.