అక్కినేని నాగార్జున, దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు కుటుంబాలు కూడా చిత్ర పరిశ్రమలో మంచి హోదా ఉన్నవారు కావడంతో. ఇక రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో నాగార్జున- లక్ష్మీల వివాహం జరిగింది. సినిమాల్లోకి రాకముందు నాగార్జున సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో జాబ్ చేస్తూ ఉండేవాడు. తన తండ్రి నాగేశ్వరరావు లాగే సినిమాలో నటించాలనే ఆస్తితో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
అయితే నాగార్జున భార్య లక్ష్మీకి తన భర్త సినిమాలో నటించడం ఇష్టం ఉండేది కాదట. అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేసుకుంటూ అక్కడే ఉండాలని నాగార్జునతో ఎప్పుడు గొడవ పడేదట. నాగార్జున తన భార్య చెప్పిన మాటలకు ఒప్పుకునేవాడు కాదట. ఇక దీంతో వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యి ఆ సమయంలోనే నాగచైతన్య జన్మించాడు. లక్ష్మీ- నాగార్జును సినిమాల్లో నటించకూడదని చాలా రాద్థాంతం కూడా చేసేదట. దానికి నాగార్జున అసలు ఒప్పుకునే వాడు కాదట.
ఇక రెండు కుటుంబాలు చాలా ధనవంతులు కావడంతో ఈ ఇద్దరిలో ఎవరూ రాజీ పడే వారు కాదట. ప్రతి విషయాన్ని పెద్దదిగా చేసేవారట. ఇక ప్రతి విషయంలోనూ తన భర్త కన్నా తనదే పై చేయి ఉండాలని లక్ష్మీ కావాలనే గొడవ చేసేదట. అలా నాలుగేళ్లపాటు వీరిద్దరు గొడవలు పడుతూ చివరకు విడాకులు తీసుకుని విడిపోయారు. అదే సమయంలో నాగార్జున తన కొడుకు నాగచైతన్యని తనతోనే తీసుకువెళ్లాడు.
అప్పుడప్పుడు తన తల్లి వద్దకు కూడా నాగచైతన్య ఇప్పటికీ వెళుతూ ఉంటాడు. అంతే కాకుండా ఈ రెండు కుటుంబాల్లో ఎలాంటి పండుగలు జరిగిన అందరూ కలుస్తూ ఉంటారు. ఇక విడాకులు అనంతరం సినిమాల్లో బిజీ అయిన నాగార్జున స్టార్ హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇక వీరికి అఖిల్ జన్మించాడు. ఈ విధంగా నాగార్జున తన మొదటి భార్య చేసిన రాద్ధాంతం వలనే ఆమెకు దూరం అవ్వాల్సి వచ్చింది.