టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ డి. రామానాయుడు తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు విక్టరీ వెంకటేష్. మొదట వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న వెంకటేష్ అనుకోకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కుటుంబ నేపథ్య కథలలో తనదైన స్టైల్లో నటించి కోట్లాదిమంది ప్రేక్షకులు ఆదరణ పొందాడు. వెంకీ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. వెంకీ నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్గా నిలిచాయి.
35 సంవత్సరాల నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు వెంకీ. వెంకీ టాలీవుడ్ కి పరిచయం చేసిన ఎంతోమంది స్టార్ హీరోయిన్లలో దివంగత నటి దివ్యభారతి కూడా ఒకరు. ముంబైలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ బొబ్బిలి రాజా సినిమాలో వెంకటేష్ సరసన నటించింది. బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1990లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది.
టాలీవుడ్లో తొలి సినిమాతోనే హిట్ అందుకున్న దివ్యభారతి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న టైంలోనే హఠాత్తుగా మృతిచెందింది. 19 ఏళ్ల చిన్న వయసులోనే దివ్యభారతి ముంబైలో తులసి బిల్డింగ్స్లో తన ఫ్లోర్ బాల్కనీ నుంచి జారి పడి మరణించింది. దాదాపు 30 సంవత్సరాల క్రితం జరిగిన ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
కేవలం రెండు సంవత్సరాల్లోనే 30 సినిమాలకు పైగా నటించిన దివ్యభారతి కళ్ళు మూసిందని తెలియగానే కోట్లాదిమంది అభిమానులతో పాటు.. సినీ ఇండస్ట్రీ కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. దివ్యభారతితో కలిసి నటించిన వెంకటేష్ బొబ్బిలి రాజా సినిమా షూటింగ్ టైంలో దివ్యభారతితో చాలా సన్నిహితంగా ఉండేవాడట.
అలా మరో సినిమాలో వెంకటేష్ – దివ్యభారతి తో నటించాలనుకునే సమయానికి దివ్యభారతి హఠాత్మరణం చెందడంతో వెంకటేష్ ఆ వార్తను జీర్ణించుకోలేకపోయాడట. చిన్న వయసులోనే ఆమె చనిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురి అయిన వెంకీ ముంబైకి వెళ్లి ఆమె పార్థివదేహానికి నివాళులు అర్పిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు.