నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంత ఫుల్ స్వింగ్లో ఉన్నాడో చూస్తున్నాం. బాలయ్య పట్టిందల్లా బంగారం అవుతోంది. వెండితెర లేదు.. బుల్లితెర లేదు.. ఎక్కడ చూసినా బాలయ్య నామస్మరణ మార్మోగుతోంది. వెండితెర మీద బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి రెండూ సూపర్ హిట్లు అయ్యాయి. వీరసింహారెడ్డి సంక్రాంతికి గట్టి పోటీ మధ్య వచ్చి కూడా బ్లాక్బస్టర్ కొట్టింది.
ఇక బుల్లితెరపై ఇప్పటికే రెండు సీజన్లలో చేసిన అన్స్టాపబుల్ టాక్ షో అయితే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ క్రమంలోనే ఇప్పుడు కుర్ర హీరోల సినిమాల్లో కూడా బాలయ్య ప్రస్తావన వస్తోంది. ఎక్కడ చూసినా జై బాలయ్య నామస్మరణ మార్మోగుతోంది. అసలు టాలీవుడ్లో ఏ హీరో సినిమా రిలీజ్ అయినా కూడా తొలి రోజు థియేటర్లలో జై బాలయ్య అనేంత మానియాలో బాలయ్య నామస్మరణ మార్మోగుతోంది.
తాజాగా బాలయ్య జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న రుద్రంగి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగపతిబాబు హీరోగా అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే నెల 7న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య మాట్లాడేందుకు మైక్ తీసుకున్న వెంటనే ఫ్యాన్స్ కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సె… అంటూ తమకు అలవాటైన రేంజ్లోనే నినాదాలు చేయడం మొదలు పెట్టేశారు.
దీంతో బాలయ్య స్పందిస్తూ నేను సె.. ఏంటి ? ఇక్కడున్న సుమ, మమతా మోహన్దాస్, విమలారామన్ వాళ్లంతా ఈ మాటలకు ఫీల్ అవుతారు… అంటూ బాలయ్య సరదాగా నవ్వులు పూయించారు. బాలయ్య హీరోయిన్ల గురించి సరదాగా మాట్లాడడంతో అక్కడ విజిల్స్ ఆగలేదు. వీరిలో మమతా మోహన్దాస్ ఎన్టీఆర్కు జోడీగా యమదొంగ సినిమాలో నటించారు. ఈ నవ్వుల తర్వాత బాలయ్య జగపతిబాబు గురించి మాట్లాడుతూ ఆకాశానికి ఎత్తేశారు. రుద్రంగి మంచి సినిమా అవుతుందని.. ఆ సినిమా హిట్ అవుతుందని ఆకాంక్షించారు.